గ్రూప్-4 కంటే ముందే గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని టీఎస్పీఎస్సీ భావిస్తోంది. మార్చి లేదా ఏప్రిల్లో

గ్రూప్ 1 మెయిన్స్ ముందు
పది రోజుల్లో ప్రిలిమ్స్ ఫలితాలు
తయారీకి 3 నెలల సమయం
మార్చి లేదా ఏప్రిల్లో మెయిన్స్
నిర్వహణకు TSPSC ఏర్పాట్లు
వచ్చే మే 7 నుంచి నీట్-యూజీ పరీక్ష
హైదరాబాద్ , డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): గ్రూప్-4 కంటే ముందే గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని టీఎస్పీఎస్సీ భావిస్తోంది. మార్చి లేదా ఏప్రిల్లో మెయిన్స్ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. గ్రూప్-1 పోస్టుల్లో మహిళలకు రిజర్వేషన్లపై హైకోర్టు గురువారం స్పష్టత ఇచ్చిన నేపథ్యంలో.. ప్రిలిమ్స్ ఫలితాలను వెల్లడించేందుకు కమిషన్ కసరత్తు ప్రారంభించింది. అనేది వారం పది రోజుల్లో తేలిపోనుంది. ఫలితాల ప్రకటన అనంతరం ప్రిపరేషన్కు మూడు నెలల సమయం ఇచ్చి ఆ తర్వాత మెయిన్స్ నిర్వహించేందుకు షెడ్యూల్ను రూపొందించనున్నట్లు సమాచారం. 503 గ్రూప్-1 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. పోస్టుల భర్తీలో భాగంగా అక్టోబర్ 16న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. 2,86,031 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. మహిళా రిజర్వేషన్లపై కోర్టులో కేసు వేయడంతో ఫలితాల వెల్లడి ఆలస్యమైంది. ప్రిలిమ్స్ రాసిన వారిలో మార్కులు, రిజర్వేషన్ల ఆధారంగా ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున అభ్యర్థులను మెయిన్స్కు ఎంపిక చేస్తారు. ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైన అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి జనవరి, ఫిబ్రవరిలో పరీక్షలు నిర్వహించనున్నారు. తర్వాత మార్చి నుంచి ఇంటర్, పదో వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు పూర్తయిన తర్వాత గ్రూప్-1 మెయిన్స్ నిర్వహిస్తారు. గ్రూప్-4 పరీక్షను ఏప్రిల్/మే నెలల్లో నిర్వహించవచ్చని కమిషన్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.
నవీకరించబడిన తేదీ – 2022-12-17T13:13:46+05:30 IST