‘మోదీ ఇంటి పేరు’ కేసులో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది.
మోడీ ఇంటిపేరు కేసులో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. 2019లో ‘మోదీ ఇంటి పేరు’ పరువు తీశారంటూ రాహుల్ గాంధీపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. తాజాగా రాహుల్ రెండేళ్ల శిక్షపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ సంజయ్ కుమార్లతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. రాహుల్ తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. పరువునష్టం దావా వేసిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ అసలు తన ఇంటిపేరు మోదీ కాదని, ఆ తర్వాత ఆ ఇంటిపేరును స్వీకరించారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు, పార్లమెంట్కు హాజరయ్యేందుకు రాహుల్ గాంధీ నిర్దోషిగా విడుదలయ్యేందుకు ఇదే చివరి అవకాశం అని కోర్టుకు తెలిపింది. అయితే పూర్తి వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు విధించిన రెండేళ్ల శిక్షపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
మోడీ ఇంటిపేరు కేసు: గుజరాత్ హైకోర్టులో రాహుల్ గాంధీకి ఎదురుదెబ్బ
2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్ణాటకలోని కోలార్లో నిర్వహించిన ర్యాలీలో రాహుల్ గాంధీ.. ‘దొంగలందరికీ మోదీ అనే ఉమ్మడి పేరు ఎలా వస్తుంది’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై గుజరాత్కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ పరువునష్టం దావా వేశారు. దీంతో సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ల శిక్ష విధించింది. ప్రజాప్రాతినిధ్య చట్టం కింద కూడా ఆయనపై అనర్హత వేటు పడింది. ఈ కోర్టు తీర్పు ఆధారంగా రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వాన్ని కోల్పోయారు. ఆ తర్వాత శిక్షపై స్టే విధించాలని గుజరాత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, దానిని కోర్టు తిరస్కరించింది. దీన్ని సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీకి రెండేళ్ల శిక్షపై సుప్రీంకోర్టు స్టే విధించింది.