అభిమానులు, ప్రముఖుల సందర్శనార్థం ఎల్బీ నగర్ స్టేడియంలో గద్దర్ భౌతికకాయాన్ని ఉంచారు. ఎల్బీ నగర్ స్టేడియంలో ఇవాళ మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రజల సందర్శనార్థం గద్దర్ పార్ధిదేహం ఉంచనున్నారు.

గద్దర్
గద్దర్ : ప్రముఖ గాయకుడు, విప్లవ వీరుడు గద్దర్ కన్నుమూశారు. అనారోగ్యంతో కొద్దిరోజులుగా హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచారు. పది రోజుల క్రితం గద్దర్కు గుండెపోటు రావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గద్దర్ కథ, బుర్ర కథలతో గ్రామస్తులను అలరించారు. ఇతర రాష్ట్రాల్లోనూ ప్రదర్శనలు ఇచ్చాడు. గద్దర్ మృతి పట్ల రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, కవులు, కళాకారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Gaddar Passed Away : గద్దర్ ఎక్కడికి వెళ్లినా చేతిలో కర్ర ఉండాల్సిందే.. ఎవరు ఇచ్చారో తెలుసా?
అభిమానులు, ప్రముఖుల సందర్శనార్థం ఎల్బీ నగర్ స్టేడియంలో గద్దర్ భౌతికకాయాన్ని ఉంచారు. ఎల్బీ నగర్ స్టేడియంలో ఇవాళ మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రజల సందర్శనార్థం గద్దర్ పార్ధిదేహం ఉంచనున్నారు. అయితే సోమవారం ప్రభుత్వ లాంఛనాలతో గద్దర్ అంత్యక్రియలు జరగనున్నాయి. విధివిధానాలతో నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఎల్బీ స్టేడియం నుంచి గద్దర్ అంతిమ యాత్ర ప్రారంభమవుతుంది. ఎల్బీ స్టేడియం నుంచి గన్పార్క్, అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్థూపం, ట్యాంక్బండ్ మీదుగా అల్వాల్లోని ఆయన నివాసం వరకు అంతిమ యాత్ర సాగనుంది. గద్దర్ మృతదేహాన్ని మరికొంత కాలం అల్వాల్లో ఉంచనున్నారు. అనంతరం సమీపంలోని బోధి విద్యాలయానికి తీసుకెళ్లి అక్కడ అంత్యక్రియలు నిర్వహిస్తారు.
ఎల్బీస్టేడియంలో గద్దర్ పార్ధివ దేహానికి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు, కిన్నెర మొగిలి, పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు నివాళులర్పించారు. గద్దర్ను చివరిసారి చూసేందుకు ఎల్బీ స్టేడియంకు ఆయన అభిమానులు భారీగా తరలివస్తున్నారు.