ఏపీ ప్రభుత్వంపై చిరంజీవి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతుండటంతో… మంత్రుల రియాక్షన్ విస్తృత చర్చలోకి రావడంతో… ఆ టాపిక్ డైవర్ట్ చేసేందుకు వైసీపీలోని అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్ వెంటనే రంగంలోకి దిగింది. ఘటన జరిగి నాలుగు రోజులవుతున్నా.. ఎనిమిది కేసులు పెట్టి వందలాది మందిని అరెస్ట్ చేయడంతో ఉమాపతి రెడ్డి అనే వ్యక్తితో కొత్త ఫిర్యాదు, చంద్రబాబు ఏ వన్ గా పోలీస్ స్టేషన్ లో హత్యాయత్నం కేసు నమోదైంది. 8వ తేదీన కేసు వేసినట్లుగానే 9వ తేదీన మీడియాకు ఎఫ్ఐఆర్ లు లీక్ అయ్యాయి.
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం అంగల్లులో జరిగిన ఘటనకు సంబంధించి తంబళ్లపల్లి నియోజకవర్గం ముదివేడు పోలీస్ స్టేషన్లో 4వ తేదీన ఎఫ్ఐఆర్లో చంద్రబాబు నాయుడు ఏ1గా, దేవినేని ఉమపై ఏ2గా కేసులు నమోదైనట్లు వెలుగులోకి వచ్చింది. వీరితో పాటు మాజీ మంత్రి అమర్నాథ్రెడ్డి, పీలేరు నియోజకవర్గ ఇన్చార్జి నల్లారి కిషోర్కుమార్రెడ్డి, రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి గంటా నరహరితోపాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఉమాపతిరెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 4వ తేదీన మారణాయుధాలు, ఇనుప రాడ్లు, ఇటుకలు, కర్రలతో ప్రయాణిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారని ఉమాపతి రెడ్డి ఫిర్యాదు చేశారు. 307 హత్యాయత్నం, 120 బి క్రిమినల్ కుట్ర చట్టం కింద కేసు నమోదు చేశారు.
అసలు విషయం చంద్రబాబుపై హత్యాయత్నం. రాళ్లతో దాడి చేశారు. బ్లాక్ క్యాట్ కమాండోలు రక్షణగా నిలిచారు. కానీ… చంద్రబాబుపైనే రివర్స్ కేసు పెట్టారు. నాలుగు రోజుల తర్వాత కూడా పార్టీ నేతలందరి పేర్లను చేర్చడంపై టీడీపీ నేతలు కుట్ర స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు. చిరంజీవి ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలు తదుపరి చర్చలకు వెళ్లకుండా ఇలాంటి కుట్ర కేసుల్లో చిక్కుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కానీ ఈ ప్రభుత్వం మొదటి నుంచి ఇలాగే చేస్తోందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.