సాలూరు ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం రాజన్నదొరకు జగన్ రెడ్డి షాక్ ఇచ్చారు. తన నియోజకవర్గంలో గిరిజిన యూనివర్సిటీకి శంకుస్థాపన చేసి తన గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ శంకుస్థాపన సభలో డిప్యూటీ సీఎం గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నియోజకవర్గ అభివృద్ధికి ఒక్క వరాలు కూడా ప్రకటించలేదు. సీఎం జగన్మోహన్రెడ్డి మాట్లాడే సమయంలో డిప్యూటీ సీఎం రాజన్నదొర ఆయన పక్కనే నిల్చున్నారు
.
జగన్ తన 35 నిమిషాల ప్రసంగంలో దొర గురించి ప్రస్తావించకపోవడం కొత్త చర్చకు తెరతీసింది. మరో ఆరు నెలల్లో ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో డిప్యూటీ సీఎంగా రాజన్నదొర పనితీరుపై సీఎం జగన్ ఏమీ మాట్లాడలేదు. 2024 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా మళ్లీ రాజన్నదొరను ఆశీర్వదించమని చెప్పకపోవడంతో ఆయనకు టిక్కెట్టు దక్కలేదని అంటున్నారు.
సీఎం జగన్ ఇటీవల కురుపాం నియోజకవర్గంలో పర్యటించారు. అక్కడ జరిగిన సభలో మాజీ మంత్రి పుష్పశ్రీవాణి గురించి సీఎం జగన్ ప్రస్తావించారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పుష్పశ్రీవాణిని మళ్లీ గెలిపించాలని జగన్ కోరారు. కానీ సాలూరు నియోజకవర్గంలో జరిగిన గిరిజన యూనివర్శిటీ శంకుస్థాపన సభలో రాజన్నదొర పరిస్థితి తేటతెల్లమైంది. ఆయనకు టిక్కెట్టు దక్కకపోవడం దాదాపు ఖాయం అని అంటున్నారు.
కొన్ని సంస్థలతో కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరుపై వైసీపీ నాయకత్వం రహస్యంగా సర్వేలు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సర్వేల్లో డిప్యూటీ సీఎం రాజన్నదొరకు ప్రతికూల పవనాలు వీస్తున్నాయన్న వాదనలు జోరుగా సాగుతున్నాయి. నియోజకవర్గ పార్టీపై పట్టు లేకపోవడం, ఉమ్మడి జిల్లాకు చెందిన అగ్రనేత పూర్తిగా పార్టీ అంతర్గత సర్వేల ప్రభావంతో పని చేస్తున్నారనేది పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశమవుతోంది.
పోస్ట్ డిప్యూటీ సీఎం దొరకు టిక్కెట్టు హామీ ఇవ్వని జగన్! మొదట కనిపించింది తెలుగు360.