చివరిగా నవీకరించబడింది:
తెలంగాణలోని కొన్ని నియోజకవర్గాల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నారనేది వాస్తవం. ముఖ్యంగా హైదరాబాద్ లోని కూకట్ పల్లి, శేరిలింగంపల్లి వంటి నియోజకవర్గాల్లో ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లోని పలు నియోజకవర్గాల్లో సీమాంధ్ర రాజకీయాల ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో ప్రముఖుడు

పోసాని కృష్ణ మురళి: తెలంగాణలోని కొన్ని నియోజకవర్గాల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నారనేది వాస్తవం. ముఖ్యంగా హైదరాబాద్ లోని కూకట్ పల్లి, శేరిలింగంపల్లి వంటి నియోజకవర్గాల్లో ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లోని పలు నియోజకవర్గాల్లో సీమాంధ్ర రాజకీయాల ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో ప్రముఖ నటుడు, ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణ మురళి తెలంగాణలో ఉంటున్న సీమాంధ్రులకు విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కుల, మతాలకు అతీతంగా సీమాంధ్ర ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పోసాని కోరారు. మనలను కాపాడిన కేసీఆర్కు మద్దతుగా నిలవాలని.. ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్కు ఓటు వేయాలని పోసాని కృష్ణమురళి అన్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఇప్పటికే పోటీ నుంచి తప్పుకుని కాంగ్రెస్కు మద్దతు ఇస్తోంది. వైసీపీ నేత పోసాని కృష్ణమురళి సీమాంధ్రులను బీఆర్ఎస్ పార్టీకి మద్దతివ్వాలని కోరడం ద్వారా జగన్ కూడా బీఆర్ఎస్కు పరోక్షంగా మద్దతు ఇస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
తెలంగాణ ఏర్పడిన తర్వాత తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న సీమాంధ్రులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదుకున్నారని పోసాని అన్నారు. ముఖ్యంగా హైదరాబాద్లో స్థిరపడిన సీమాంధ్రులు కేసీఆర్ పాలనలో ఎలాంటి అభద్రతాభావం లేకుండా జీవిస్తున్నారని అన్నారు. సెటిలర్స్ అనే పదం వినిపించడం లేదని… తెలంగాణ, ఆంధ్రా ప్రజలు అన్నదమ్ముల్లా కలిసి జీవిస్తున్నారని పోసాని పేర్కొన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ అభివృద్ధి శరవేగంగా సాగుతోందన్నారు. అతి తక్కువ సమయంలోనే హైదరాబాద్ ఈ స్థాయి అభివృద్ధిని సాధించడం గొప్ప విషయమన్నారు. హైదరాబాద్ను చూస్తే న్యూయార్క్ను చూడనట్లు ఉంటుందని పోసాని కృష్ణమురళి అన్నారు. ఇది బీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం.