ప్రజలు ప్రశ్నిస్తారు కాబట్టే సీఎం కేసీఆర్ ముఖం చూపించారని మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికుల కోసం పోరాడింది బీజేపీ మాత్రమే అన్నారు.

బండి సంజయ్ ఫైర్ సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ పై బండి సంజయ్ : సీఎం కేసీఆర్ పై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. ఆర్టీసీ కార్మికులను మోసం చేసేందుకు కేసీఆర్ కొత్త డ్రామాకు తెరలేపారని మండిపడ్డారు. ఆర్టీసీని ప్రభుత్వంలో ఎలా విలీనం చేస్తారో కేసీఆర్ చెప్పాలన్నారు. కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తే ఆర్టీసీని ముంచేస్తారని విమర్శించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటించకపోవడం దారుణమన్నారు.
ప్రజలు ప్రశ్నిస్తారు కాబట్టే సీఎం కేసీఆర్ ముఖం చూపించారని మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికుల కోసం పోరాడింది బీజేపీ మాత్రమే అన్నారు. రానున్న ఎన్నికల్లో చావో రేవో తేల్చుకుంటామన్నారు. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు సైనికుడిలా పని చేస్తానన్నారు.
బీజేపీలో తనను మించిన అదృష్టవంతుడు లేడని అన్నారు.
సామాన్య కార్యకర్తకు జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వడం బీజేపీలోనే సాధ్యమన్నారు. కిషన్రెడ్డి నాయకత్వంలో తెలంగాణకు రామరాజ్యం, మోదీ రాజ్యమేలుతుందన్నారు. బీజేపీ నేతల మధ్య ఎలాంటి వర్గపోరు లేదని స్పష్టం చేశారు. పార్టీలో నేతల మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు సహజమేనన్నారు. బీజేపీ అధ్యక్షుడి హోదాలో ప్రజల కోసమే రెండు సార్లు జైలుకు వెళ్లానని చెప్పారు.
పార్టీకి రుణపడి ఉంటానని, సైనికుడిలా పని చేస్తానన్నారు. పదవులతో సంబంధం లేకుండా తనపై ప్రేమ చూపుతున్న కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యమకారుల కృషి వల్లే ప్రజాసంగ్రామయాత్రకు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని వెల్లడించారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న తమపై బీఆర్ ఎస్ ప్రభుత్వం దాడులు చేసిందని వాపోయారు. గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగురవేస్తామని స్పష్టం చేశారు.