టీమ్ ఇండియా: టీం ఇండియా యువ స్పిన్ బౌలర్ రవి బిష్ణోయ్ ఐసీసీ ర్యాంకుల్లో సత్తా చాటాడు. ఐసీసీ ఇటీవల ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్లో రవి బిష్ణోయ్ నంబర్ వన్ బౌలర్గా నిలిచాడు. రవి బిష్ణోయ్ 699 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు.

టీం ఇండియా యువ స్పిన్ బౌలర్ రవి బిష్ణోయ్ ఐసీసీ ర్యాంకుల్లో సత్తా చాటాడు. ఐసీసీ ఇటీవల ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్లో రవి బిష్ణోయ్ నంబర్ వన్ బౌలర్గా నిలిచాడు. రవి బిష్ణోయ్ 699 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు టీ20ల సిరీస్లో నిలకడైన ప్రదర్శనతో రవి బిష్ణోయ్ ఐసీసీ ర్యాంకుల్లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఐదు మ్యాచ్ల్లో 9 వికెట్లు పడగొట్టి మ్యాన్ ఆఫ్ ద సిరీస్గా నిలిచాడు. ఈ క్రమంలో అఫ్గానిస్థాన్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ రెండో స్థానానికి పడిపోయాడు. రషీద్ ఖాన్ ఖాతాలో 692 పాయింట్లు ఉన్నాయి. ఈ జాబితాలో శ్రీలంక బౌలర్ హసరంగా (679), ఇంగ్లండ్ బౌలర్ ఆదిల్ రషీద్ (679) సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నారు. శ్రీలంక బౌలర్ మహిష్ థిక్షన్ 677 పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు. శామ్ కరణ్ (ఇంగ్లండ్), ఫజల్లా ఫరూఖీ (ఆఫ్ఘనిస్థాన్), ముజిబుర్ రెహమాన్ (ఆఫ్ఘనిస్థాన్), అకీల్ హుస్సేన్ (వెస్టిండీస్), ఎన్రిచ్ నోకియా (దక్షిణాఫ్రికా) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.
కాగా, దక్షిణాఫ్రికా టూర్లో రవి బిష్ణోయ్ రాణిస్తే వచ్చే ఏడాది జూన్లో జరిగే టీ20 ప్రపంచకప్లో తన స్థానాన్ని ఖరారు చేసుకుంటాడని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఐసీసీ బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో టీమిండియా ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. 855 రేటింగ్ పాయింట్లతో నంబర్ వన్ ర్యాంక్ లో కొనసాగుతున్నాడు. రుతురాజ్ గైక్వాడ్ ఒక స్థానం దిగజారి ఏడో స్థానానికి చేరుకున్నాడు. టీమ్ విభాగంలో టీమ్ ఇండియా 265 రేటింగ్ పాయింట్లతో ఐసీసీ ర్యాంకుల్లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. టీ20 ఫార్మాట్తో పాటు వన్డేలు, టెస్టుల్లో టీమిండియా నంబర్వన్గా అవతరించింది.
మరింత క్రీడా వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నవీకరించబడిన తేదీ – 2023-12-06T16:20:44+05:30 IST