అర్జున్ టెండూల్కర్: భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ రంజీ ట్రోఫీ 2024లో తన సత్తాను చాటుతున్నాడు. అర్జున్ ఇప్పటికే ఈ సీజన్లో బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీలు చేశాడు. ముఖ్యంగా కర్ణాటకతో జరిగిన ఓపెనింగ్ మ్యాచ్ లో కష్టకాలంలో జట్టును ఆదుకున్నాడు.

మైసూర్: భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ రంజీ ట్రోఫీ 2024లో తన సత్తాను చాటుతున్నాడు. అర్జున్ ఇప్పటికే ఈ సీజన్లో బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీలు సాధించాడు. ముఖ్యంగా కర్ణాటకతో జరిగిన ఓపెనింగ్ మ్యాచ్ లో కష్టకాలంలో జట్టును ఆదుకున్నాడు. ఈ మ్యాచ్ లో అర్జున్ ప్రాతినిధ్యం వహిస్తున్న గోవా జట్టు 221 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో 8వ ర్యాంక్లో బ్యాటింగ్కు వచ్చిన అర్జున్, 10వ నంబర్ బ్యాట్స్మెన్ హెరంబ్ పరబ్తో కలిసి జట్టును ఆదుకున్నాడు. వీరిద్దరూ 9వ వికెట్కు 93 పరుగులు జోడించారు. ఈ క్రమంలో ఇద్దరూ అర్ధ సెంచరీలు సాధించారు. 250 పరుగుల లోపే ఆలౌటవ్వాల్సిన ఆ జట్టు స్కోరు 300 దాటింది.
హెరంబ్ పరబ్ 53 పరుగులు చేశాడు. అర్జున్ 3 ఫోర్లు, ఒక సిక్సర్తో 52 పరుగులు చేశాడు. దీంతో గోవా జట్టు తొలి ఇన్నింగ్స్లో 321 పరుగులకు ఆలౌటైంది. ఛత్తీస్గఢ్తో జరిగిన చివరి మ్యాచ్లోనూ అర్జున్ 70 పరుగులు చేశాడు. అయితే కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (114), దేవదత్ పడిక్కల్ (103) సెంచరీలతో చెలరేగడంతో కర్ణాటక జట్టు తొలి ఇన్నింగ్స్లో పటిష్ట స్థితిలో నిలిచింది. 98 ఓవర్లు ముగిసే సరికి అప్పటికే అగ్రస్థానంలో నిలిచిన ఆ జట్టు 4 వికెట్ల నష్టానికి 396 పరుగులు చేసింది. క్రీజులో నికిన్ జోస్ (73), శ్రీనివాస్ శరత్ (48) ఉన్నారు. కాగా అర్జున్ గత సీజన్లోనే రంజీ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. ఆ సీజన్లో సెంచరీ కూడా చేశాడు. ఈ సీజన్లో బ్యాట్తో సత్తా చాటుతున్న అర్జున్.. బంతితో రాణించలేకపోతున్నాడు. 3 ఇన్నింగ్స్ల్లో 3 వికెట్లు మాత్రమే తీశాడు. గత సీజన్ ఐపీఎల్ లో హాఫ్ సెంచరీ చేసిన అర్జున్ 4 మ్యాచ్ లు ఆడి 3 వికెట్లు పడగొట్టాడు.
మరింత క్రీడా వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నవీకరించబడిన తేదీ – జనవరి 21, 2024 | 01:19 PM