టీమ్ ఇండియా: టీమిండియా యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు టెస్టుల సిరీస్కు దూరమైన తర్వాత అతను భారత్కు వచ్చాడు. ఈ విషయంపై బీసీసీఐ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

టీమిండియా యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు టెస్టుల సిరీస్కు దూరమైన తర్వాత అతను భారత్కు వచ్చాడు. ఈ విషయంపై బీసీసీఐ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే ఇషాన్ కిషన్ స్వదేశానికి రావడంపై చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. టీ20, వన్డే సిరీస్లలో అవకాశం రాకపోయినా.. టెస్టు సిరీస్లో ఇషాన్ ఆడతాడని అంతా భావించారు. అయితే అనూహ్యంగా ఇషాన్ గైర్హాజరు కావడం వెనుక బలమైన కారణం ఉందని తెలుస్తోంది. మానసిక ఒత్తిడిని అధిగమించేందుకే ఇషాన్ కిషన్ దక్షిణాఫ్రికా పర్యటన నుంచి స్వదేశానికి చేరుకున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు కొన్నాళ్లు ఆటకు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.
వన్డే ప్రపంచకప్లో శుభ్మన్ గిల్ అస్వస్థతకు గురికావడంతో ఇషాన్ కిషన్కు తొలి రెండు మ్యాచ్ల్లో అవకాశం లభించింది. కానీ గిల్ రాకతో కిషన్ ను టీమ్ మేనేజ్ మెంట్ పక్కన పెట్టింది. తర్వాత ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ లో నిలకడగా రాణించిన ఇషాన్ కిషన్ దక్షిణాఫ్రికా పర్యటనలో తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. శుభమన్ గిల్ రీఎంట్రీ.. జితేషా శర్మకు అవకాశం ఇవ్వడంతో ఇషాన్ కిషన్ బెంచ్ కే పరిమితమయ్యాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు టెస్టుల సిరీస్కు ఎంపికైనప్పటికీ.. తొలి ప్రాధాన్యత కేఎల్ రాహుల్కే దక్కడంతో ఇషాన్ కిషన్ తప్పుకోవడం ఉత్తమమని భావించాడు. అందుకే ఇంటికి వచ్చి విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఐపీఎల్ వరకు ఆటకు దూరంగా ఉండాలని ఇషాన్ కిషన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఇషాన్ కిషన్ రెండు టెస్టులతో పాటు 17 వన్డేలు, 11 టీ20లు ఆడాడు. అతను 29 ఇన్నింగ్స్లలో 29.64 సగటుతో 741 పరుగులు చేశాడు. ఇందులో ఏడు అర్ధ సెంచరీలు ఉన్నాయి.
మరింత క్రీడా వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నవీకరించబడిన తేదీ – డిసెంబర్ 23, 2023 | 07:57 PM