మరో ఐదేళ్ల వరకు ‘పోలవరం’ పూర్తికాదు
ఆ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభమైంది
ఫలితాలు ఇప్పటికే ప్రజల్లోకి వస్తున్నాయి
దేశానికి అన్నం పెట్టే రాష్ట్రం తెలంగాణ
రానున్న రోజుల్లో జిల్లాకో మెడికల్ కాలేజీ
రాష్ట్రంలో సాధారణ జననాలు పెరగాలి
ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు
సిద్దిపేట క్రైం/ సిద్దిపేట టౌన్/ చిన్నకోడూర్/ సుభాష్నగర్ (కరీంనగర్), నవంబర్ 13: రాష్ట్ర ప్రభుత్వం త్వరలో గ్రూప్-4 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఆర్థిక మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఆదివారం ఉదయం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ‘కానిస్టేబుల్ , ఎస్ ఐ అభ్యర్థులకు ఉచిత ఫిజికల్ ఫిట్ నెస్ ఉచిత శిక్షణ కేంద్రం’లో ఆయన పాలు, గుడ్లు పంపిణీ చేశారు. పట్టుదలతో ఉద్యోగం సాధిస్తే ప్రజాప్రతినిధిగా అదే నిజమైన సంతోషమని అభ్యర్థుల్లో స్ఫూర్తి నింపారు. అభ్యర్థులందరూ ఉచిత శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం చిన్నకోడూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవానికి మంత్రి హాజరయ్యారు. చంద్లాపూర్ గ్రామంలోని లక్ష్మీ రంగనాయకస్వామి ఫంక్షన్ హాలులో కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు కంటే ముందు ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నేటికీ పూర్తి కాలేదని, ఐదేళ్లు గడిచినా పూర్తి కాలేదన్నారు. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టును తొందరగా పూర్తి చేసి ఫలాలు ప్రజలకు అందించామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు రాష్ట్రంలో సాగుభూమి 30 లక్షల ఎకరాలు ఉండేదని, రాష్ట్రం ఏర్పడి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక 2.30 కోట్ల ఎకరాలకు పెరిగిందని హరీశ్ రావు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల భూగర్భ జలాలు పెరిగి భూమి భారీగా పండుతోందన్నారు. దేశానికి అన్నం పెట్టే రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. ఇదిలా ఉండగా సిద్దిపేట పట్టణానికి చెందిన తరుణ్ అనే బాలుడు తాను పొదుపు చేసిన డబ్బును బీఆర్ఎస్ పార్టీకి విరాళంగా ఇచ్చాడు. ఆదివారం లింగారెడ్డిపల్లి పెద్దమ్మ ఆలయంలో తరుణ్ తన కిడ్డీ బ్యాంకు రూ.2 వేలు హరీశ్కు అందజేశారు. సీఎం కేసీఆర్ కు కిడ్డీ బ్యాంకు అందజేస్తామని హరీశ్ తెలిపారు.
ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడిగా బీఎన్ రావు
వైద్య రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని హరీషరావు అన్నారు. ఆదివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) 6వ రాష్ట్ర సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్ బీఎన్ రావు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో హరీశరావు పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు కేవలం ఐదు మెడికల్ కాలేజీలు ఉండేవని, ప్రస్తుతం వాటి సంఖ్య 17కు పెరిగిందని, రానున్న రోజుల్లో జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రైవేట్ వైద్యులు సేవలందించాలని, అవసరమైతే వయో సడలింపు ఉంటుందని హరీషరావు తెలిపారు. తెలంగాణలో ముఖ్యంగా కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో సిజేరియన్లు ఎక్కువగా జరుగుతున్నాయని, దీనిపై డబ్ల్యూహెచ్ఓ కూడా ఆందోళన వ్యక్తం చేసిందని హరీశ్ రావు గుర్తు చేశారు. రాష్ట్రంలో సాధారణ ప్రసవాలు పెంచాలన్నారు. ఐఎంఏ తరపున రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు బీఎన్ రావు తెలిపారు.
నవీకరించబడిన తేదీ – 2022-11-14T13:54:40+05:30 IST