ట్విట్టర్ vs మైక్రోసాఫ్ట్: టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తన డేటాను అక్రమంగా వినియోగిస్తోందని ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్ తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ మేరకు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లకు ట్విట్టర్ లేఖ రాసింది. ట్విట్టర్ డేటా వినియోగానికి సంబంధించి మైక్రోసాఫ్ట్ నిబంధనలను ఉల్లంఘించిందని లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు డబ్బులు ఇవ్వడానికి నిరాకరిస్తున్నట్లు తెలిపింది.
సత్య నాదెళ్లకు ట్విట్టర్ లేఖ
మైక్రోసాఫ్ట్ నిబంధనల ప్రకారం ఉండాల్సిన దానికంటే ఎక్కువ డేటాను వినియోగించుకుందని ట్విట్టర్ లేఖలో పేర్కొంది. అదేవిధంగా ఎలాంటి అనుమతి లేకుండా ప్రభుత్వ సంస్థలతో ట్విటర్ డేటాను పంచుకుందని తెలిపింది. మైక్రోసాఫ్ట్ అనేక విధాలుగా నిబంధనలను ఉల్లంఘిస్తోందని ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్ లాయర్ అలెక్స్ స్పైరో ఆరోపించారు.
ఆదాయాన్ని పెంచడానికి (Twitter vs Microsoft)
అయితే మైక్రోసాఫ్ట్ పై ట్విట్టర్ చేసిన ఆరోపణలపై టెక్ నిపుణులు స్పందించారు. డేటాను వినియోగిస్తున్న మైక్రోసాఫ్ట్ నుంచి డబ్బులు వసూలు చేసేందుకు ట్విట్టర్ ఇలాంటి చర్య తీసుకుందని అభిప్రాయపడ్డారు. గతేడాది 44 బిలియన్ డాలర్లకు లాన్ మస్క్ ట్విట్టర్ ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. దివాలా తీయబోతున్న కంపెనీని కాపాడేందుకు మస్క్ ఎన్నో చర్యలు తీసుకున్నాడు. అందులో భాగంగానే ట్విట్టర్ బ్లూ సబ్స్క్రిప్షన్ పాలసీని ప్రవేశపెట్టింది. ఖర్చులను నియంత్రించేందుకు ఉద్యోగుల కోత విధించారు. ఈ క్రమంలో తమ డేటాను వినియోగిస్తున్న కంపెనీల నుంచి ఆదాయాన్ని పెంచుకునేందుకు ట్విటర్ కూడా ఇదే మార్గంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది.
లేఖను పరిశీలించిన తర్వాత
గత నెలలో ఎలాన్ మస్క్ మైక్రోసాఫ్ట్ పై బహిరంగంగా ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. మైక్రోసాఫ్ట్ తమ ఏఐ టెక్నాలజీకి శిక్షణ ఇచ్చేందుకు ట్విట్టర్ డేటాను చట్టవిరుద్ధంగా ఉపయోగిస్తోందని ఆయన ట్వీట్ చేశారు. అయితే తాజా ఆరోపణలపై మైక్రోసాఫ్ట్ కూడా స్పందించింది. ప్రస్తుతం వారు ట్విట్టర్ డేటా కోసం ఎలాంటి చెల్లింపులు చేయడం లేదు. ట్విట్టర్ నుంచి తనకు లేఖ అందిందని మైక్రోసాఫ్ట్ ప్రతినిధి ఫ్రాంక్ షా స్పష్టం చేశారు. లేఖను పరిశీలించిన తర్వాతే వారు స్పందిస్తారు.
పోస్ట్ ట్విట్టర్ వర్సెస్ మైక్రోసాఫ్ట్: మైక్రోసాఫ్ట్ పై ట్విట్టర్ తీవ్ర ఆరోపణలు చేసింది మొదట కనిపించింది ప్రైమ్9.