రూ.2000 నోటు చలామణిపై ఉన్న సందేహాలకు సెంట్రల్ బ్యాంక్ ఆర్బీఐ చెక్ పెట్టింది. ఈ పెద్ద నోటును చలామణి నుంచి ఉపసంహరిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుంది. ఈ మేరకు తక్షణమే నోట్ల జారీని నిలిపివేయాలని దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది.

ముంబై: రూ.2000 నోటు చలామణిపై ఉన్న సందేహాలకు సెంట్రల్ బ్యాంక్ ఆర్బీఐ చెక్ పెట్టింది. ఈ పెద్ద నోటును చలామణి నుంచి ఉపసంహరిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుంది. ఈ మేరకు తక్షణమే నోట్ల జారీని నిలిపివేయాలని దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. కానీ ఈ నోటు సెప్టెంబర్ 30, 2023 వరకు చట్టబద్ధంగా చెల్లుబాటులో ఉంటుంది. అయితే, ఎవరైనా ఇప్పటికే నోట్లు కలిగి ఉంటే, వారు వాటిని సెప్టెంబర్ 30 లోపు బ్యాంకుల్లో మార్చుకోవచ్చు. ప్రతి విడతలో రూ.20 వేల విలువైన నోట్లను మార్చుకోవడానికి RBI అవకాశం కల్పించింది. దీన్ని ఖాతాలో జమ చేయవచ్చు లేదా ఇతర నోట్లతో మార్చుకోవచ్చు. ఈ విషయాన్ని ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. ‘క్లీన్ నోట్ పాలసీ’లో భాగంగా రూ.2000 నోటును చలామణి నుంచి ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్లు ఆర్బీఐ ప్రకటించింది.
ఆర్బీఐ చట్టం 1934లోని సెక్షన్ 24(1) ప్రకారం రూ.2000 నోట్లను నవంబర్ 2016లో చలామణిలోకి తీసుకొచ్చారు. రూ.500, రూ.1000 నోట్ల రద్దు తర్వాత ఆర్బీఐ ఈ నోటును ప్రవేశపెట్టింది. డీమోనిటైజేషన్ తర్వాత, అవసరాలకు అనుగుణంగా కరెన్సీని కలిగి ఉండాలనే లక్ష్యంతో ఈ నోట్లను ప్రవేశపెట్టారు. అయితే 2018-19 నుంచి ప్రింటింగ్ను నిలిపివేస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. చలామణిలో ఉన్న రూ.2000 నోట్లలో 89 శాతం మార్చి 2017కి ముందు జారీ చేసినవే.. మార్చి 31 నాటికి గరిష్ఠంగా రూ.6.73 లక్షల కోట్ల విలువైన రూ.2 వేల నోట్లు చలామణిలో ఉన్నాయి. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ 2023 మార్చి 31 నాటికి ఈ విలువ రూ.3.62 లక్షల కోట్లకు పడిపోయింది. ఈ విలువ ప్రస్తుతం చెలామణిలో ఉన్న కరెన్సీలో 10.8 శాతం.
ఖాతాల్లో డిపాజిట్ చేసేవారిపై ఎలాంటి పరిమితులు లేవు. ఎటువంటి నియమాలు వర్తించవు. ఇదిలా ఉండగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా రోజువారీ కార్యకలాపాలు సజావుగా సాగేందుకు రూ.20 వేల వరకు రెండు వేల నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవచ్చు. కానీ ఈ మార్పిడి సెప్టెంబర్ 30, 2023 వరకు మాత్రమే సాధ్యమవుతుంది.
నవీకరించబడిన తేదీ – 2023-05-19T19:58:30+05:30 IST