టీమిండియా స్టార్ పేస్ బౌలర్ బుమ్రా వెన్నులో గాయానికి గల కారణాలపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. బుమ్రా వెన్నునొప్పికి అతని ప్రత్యేకమైన బౌలింగ్ స్టైల్ కారణమని కొందరు చెబుతుండగా, మరికొందరు అతని గాయానికి రొమాన్స్ కారణమని ఆరోపించారు. వెన్ను గాయం నుంచి కోలుకోవడంలో భాగంగా తొలుత ఇంటికే పరిమితమైన బుమ్రా.. గాయం పూర్తిగా నయం కాకముందే భార్యతో అసహజ సంభోగానికి పాల్పడ్డాడని, దీంతో వెన్ను గాయం రివర్స్ అయ్యిందని కొందరు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

టీమిండియా స్టార్ పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా సుదీర్ఘ విరామం తర్వాత అంతర్జాతీయ మ్యాచ్ ఆడబోతున్నాడు. వెన్ను గాయం కారణంగా ఏడాది పాటు జట్టుకు దూరమైన బుమ్రా ఐర్లాండ్తో జరుగుతున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ద్వారా పునరాగమనం చేస్తున్నాడు. అది కూడా కెప్టెన్ హోదాలోనే. ఆసియా కప్, వన్డే ప్రపంచకప్ వంటి ప్రధాన టోర్నీలు సమీపిస్తున్న తరుణంలో ఐర్లాండ్తో సిరీస్లో బుమ్రా ప్రదర్శనపై భారీ అంచనాలు ఉన్నాయి. గతేడాది టీ20 ప్రపంచకప్కు ముందు దక్షిణాఫ్రికా పర్యటనలో గాయపడిన బుమ్రా.. ఈ ఏడాది ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఈ ఏడాది మార్చిలో వెన్ను గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్న అతను ఇటీవలే ఫిట్నెస్ను పొందాడు. దీంతో బుమ్రా మ్యాచ్ ప్రాక్టీస్ కోసం ఐర్లాండ్ సిరీస్కు ఎంపికవ్వడమే కాకుండా కెప్టెన్గా పగ్గాలు కూడా అప్పగించాడు.
అయితే బుమ్రా వెన్ను గాయానికి గల కారణాలపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. బుమ్రా వెన్నునొప్పికి అతని ప్రత్యేకమైన బౌలింగ్ స్టైల్ కారణమని కొందరు చెబుతుండగా, మరికొందరు అతని గాయానికి రొమాన్స్ కారణమని ఆరోపించారు. వెన్ను గాయం నుంచి కోలుకోవడంలో భాగంగా తొలుత ఇంటికే పరిమితమైన బుమ్రా.. గాయం పూర్తిగా నయం కాకముందే భార్యతో అసహజ సంభోగానికి పాల్పడ్డాడని, దీంతో వెన్ను గాయం రివర్స్ అయ్యిందని కొందరు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఏడాది మార్చిలో కోలుకుంటున్న సమయంలో బుమ్రా మళ్లీ గాయపడడాన్ని చూస్తే అర్థమవుతుందని పలువురు సూచిస్తున్నారు. వీపుపై ఒత్తిడి తెచ్చేందుకే సెక్స్ లో పాల్గొన్నాడని.. దీంతో ఏడాది పాటు జట్టుకు దూరంగా ఉండాల్సి వచ్చిందని విశ్లేషిస్తున్నారు.
ఇది కూడా చదవండి: భారత్ వర్సెస్ ఐర్లాండ్: చివరి ఐపీఎల్ స్టార్ అరంగేట్రం.. తొలి టీ20 మ్యాచ్కి టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే!
ఇదిలా ఉంటే ఐర్లాండ్తో జరిగే మూడు టీ20ల సిరీస్లో బుమ్రా ఆశించిన రీతిలో రాణిస్తాడా.. లేక మళ్లీ గాయపడే అవకాశం ఉందా అని అభిమానులు టెన్షన్ పడుతున్నారు. బుమ్రా మార్చి 15, 2021న స్టార్ స్పోర్ట్స్ యాంకర్ సంజనా గణేశన్ను వివాహం చేసుకున్నారు. కొన్నాళ్లుగా రహస్య ప్రేమాయణం సాగించిన బుమ్రా-సంజన పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఫామ్ కోల్పోయిన బుమ్రా పేలవ ప్రదర్శన చేశాడు. బుమ్రా పేలవ ప్రదర్శన కారణంగా 2021లో దుబాయ్ వేదికగా ఎన్నో అంచనాలున్న టీ20 ప్రపంచకప్లో టీమిండియా సెమీఫైనల్కు కూడా చేరలేకపోయింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్పై ఓటమి కూడా అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. ఆ తర్వాత 2022 ఐపీఎల్లో బుమ్రా రాణించలేకపోయాడు.
నవీకరించబడిన తేదీ – 2023-08-17T19:39:33+05:30 IST