ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. దేవినేని అవినాష్ ఇంటికి వెళ్లడం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

విజయవాడలోని దేవినేని అవినాష్ ఇంటికి సీఎం జగన్ వెళ్లారు
సీఎం మగన్- దేవినేని అవినాష్: విజయవాడ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం విజయవాడలో పర్యటించారు. గుణదలలో నిర్మించిన హయత్ ప్లేస్ విజయవాడను ఆయన ప్రారంభించారు. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ చార్జి దేవినేని అవినాష్ ఇంటికి వెళ్ళాడు. అవినాష్ ఇంటికి సీఎం జగన్ వెళ్లడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.
తమ ప్రాంతానికి వచ్చిన ముఖ్యమంత్రి జగన్ను తన ఇంటికి ఆహ్వానించారు దేవినేని అవినాష్. అవినాష్ ఆహ్వానం మేరకు సీఎం జగన్ ఆయన ఇంటికి వెళ్లారు. ముఖ్యమంత్రిగా తొలిసారి తన ఇంటికి వచ్చిన జగన్కు అవినాష్ ఘనస్వాగతం పలికారు. ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. తమ కుటుంబ సభ్యులను పరిచయం చేసుకున్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో పార్టీ తరపున చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. అరగంటపాటు అవినాష్ నివాసంలో గడిపిన సీఎం జగన్ రోడ్డు మార్గంలో తాడేపల్లికి చేరుకున్నారు.
కాగా, హయత్ ప్లేస్ హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆర్కే రోజా, జోగి రమేష్, తానేటి వనిత, దేవినేని అవినాష్ పాల్గొన్నారు. హయత్ ప్లేస్ చైర్మన్ ఆర్ వీరాస్వామి, మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ సాయి కార్తీక్, జనరల్ మేనేజర్ సీహెచ్ రామకృష్ణ తదితరులు సీఎం జగన్కు స్వాగతం పలికారు.
ఇది కూడా చదవండి: చంద్రబాబుది గాంధీ సిద్ధాంతం, లోకేష్ ది భగత్ సింగ్ సిద్ధాంతం: బుద్దా వెంకన్న
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఏపీలో టూరిజం అభివృద్ధికి పెద్దపీట వేస్తుందన్నారు. విజయవాడలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి హోటళ్లు రావాలని ఆకాంక్షించారు. ప్రపంచ పర్యాటక రంగంలో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక స్థానం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. హయత్ ప్లేస్ హోటల్ నిర్వహణకు అభినందనలు.
ఇది కూడా చదవండి: త్రిశూల వ్యూహంతో సతమతమవుతున్న చంద్రబాబు, పవన్, లోకేష్!