ఇండిగో విమానం 6E6482 సోమవారం ఉదయం కొచ్చి నుంచి బెంగళూరుకు బయలుదేరింది. కొచ్చి విమానాశ్రయం నుంచి టేకాఫ్ ఆలస్యం.. అధికారులకు ఫోన్…

సాంకేతికత వచ్చిన తర్వాత, మోసపూరిత లావాదేవీలు విపరీతంగా పెరిగాయి. దుండగులు ఏకంగా బాంబు బెదిరింపు పరిధికి చేరుకున్నారు. ఉద్రిక్త వాతావరణం సృష్టించాలనే ఉద్దేశంతో కొందరు ఫేక్ కాల్స్ చేసి బాంబు బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇప్పుడు ఓ ఆగంతకుడు కూడా అలాంటి పనికి పాల్పడ్డాడు. ఇండిగో విమానంలో బాంబు ఉందంటూ తప్పుడు సమాచారం ఇచ్చాడు. దీంతో కాసేపు గందరగోళం నెలకొంది. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్, ప్రయాణికులను వెంటనే దించేయడం, అధికారులు రంగంలోకి దిగి విచారించగా.. చివరకు అది ఫేక్ కాల్ అని తేలింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఇండిగో విమానం 6E6482 సోమవారం ఉదయం కొచ్చి నుంచి బెంగళూరుకు బయలుదేరింది. కొచ్చి విమానాశ్రయం నుంచి టేకాఫ్ కావడమే ఆలస్యం.. అధికారులకు ఫోన్ వచ్చింది. సరిగ్గా 10:30 గంటలకు కాల్ వచ్చింది. విమానంలో బాంబు ఉందని గుర్తు తెలియని వ్యక్తి కాల్ కట్ చేశాడు. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే విమానాన్ని వెనక్కి తీసుకొచ్చారు. వెంటనే విమానంలోని ప్రయాణికులను దించి సురక్షిత ప్రాంతానికి తరలించారు. విమానంలో ఓ చిన్నారి సహా మొత్తం 138 మంది ప్రయాణికులు ఉన్నారు. తరువాత, తనిఖీల కోసం విమానాన్ని ఐసోలేషన్ బేకు తరలించారు. ఘటనా స్థలానికి కేరళ రాష్ట్ర పోలీసులు, బాంబ్ స్క్వాడ్తో పాటు భద్రతా బలగాలు చేరుకున్నాయి.
విమానంలో బ్యాగేజీని గంటపాటు తనిఖీ చేశారు. అనుమానాస్పదంగా ఏమీ కనిపించకపోవడంతో అది ఫేక్ ఇంటర్నెట్ కాల్ అని నిర్ధారించారు. ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న అధికారులు కేసు నమోదు చేసి ఫేక్ కాల్ చేసిన వ్యక్తిని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. మరోవైపు ఆగస్టు 18న కూడా ఢిల్లీలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. బాంబు బెదిరింపు కాల్ రావడంతో, విస్తారా ఎయిర్లైన్స్ విమానాన్ని తనిఖీల కోసం 8 గంటల పాటు నిలిపివేశారు. చివరకు అనుమానాస్పదంగా ఏమీ కనిపించకపోవడంతో విమాన సర్వీసులను పునరుద్ధరించారు.
నవీకరించబడిన తేదీ – 2023-08-28T18:56:31+05:30 IST