దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన 100 రూపాయల నాణేన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేశారు.

ఎన్టీఆర్ 100 రూపాయల కాయిన్ రిలీజ్
ఎన్టీఆర్ 100 రూపాయల నాణెం: దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన 100 రూపాయల స్మారక నాణాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేశారు. ఈ కార్యక్రమం సోమవారం రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో జరిగింది. ముందుగా ఎన్టీఆర్ జీవిత విశేషాలతో కూడిన ప్రత్యేక వీడియోను ప్రదర్శించారు. అనంతరం ద్రౌపది ముర్ము నాణేన్ని రాష్ట్రపతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్టీఆర్ స్మారక నాణేన్ని విడుదల చేయడం ఆనందంగా ఉందన్నారు. భారతీయ సినిమా చరిత్రలో ఎన్టీఆర్ చాలా ప్రత్యేకమని, ఎన్టీఆర్ లో రాముడు, కృష్ణుడి రూపాలను ప్రజలు చూశారని అన్నారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమ ఉన్నతిలో ఎన్టీఆర్ పాత్రను రాష్ట్రపతి కొనియాడారు. రాజకీయాల్లోనూ ఎన్టీఆర్ తనదైన ముద్ర వేశారని అన్నారు. ఎన్టీఆర్ విశిష్ట వ్యక్తిత్వాన్ని ప్రజలు ఎప్పటికీ మరిచిపోరు.
రాబోయే తరాలకు ఎన్టీఆర్ ఆదర్శమని పురంధేశ్వరి అన్నారు. రాజకీయాల్లో పేదల అభ్యున్నతికి ఎన్టీఆర్ కృషి చేశారన్నారు. మహిళల కోసం ప్రత్యేక యూనివర్శిటీని ఏర్పాటు చేసి మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించామన్నారు. స్మారక నాణెం విడుదల చేయడం ఎన్టీఆర్కు దక్కిన గొప్ప గౌరవమని అన్నారు. రామాయణం, మహాభారతాలకు సంబంధించిన ఎన్నో పాత్రల్లో ఎన్టీఆర్ జీవించారని, మనుషులంతా ఒక్కటే అనే సందేశాన్ని తన సినిమాల్లో ఇచ్చారని పురందేశ్వరి అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు నందమూరి బాలకృష్ణ, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణితో పాటు ఎన్టీఆర్ కుమారులు, కుమార్తెలు, కుటుంబ సభ్యులు, రాజకీయ, సినీ రంగ ప్రముఖులు పాల్గొన్నారు.
Jr NTR : NTR నాణెం విడుదల.. ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ కూడా హాజరుకాను..?
ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ హాజరుకాలేదు. దేవర సినిమా షూటింగ్ కారణంగా జూనియర్ ఎన్టీఆర్ వెళ్లని సంగతి తెలిసిందే. ఇదిలావుంటే.. 50% వెండి, 40% రాగి, 5% నికెల్, 5% జింక్తో హైదరాబాద్ మింట్ కాంపౌండ్లో ఎన్టీఆర్ 100 రూపాయల స్మారక నాణెం తయారైంది. అయితే,