జవాన్ : జవాన్ క్రేజ్ మాములుగా లేదు.. ఒక్క టికెట్ 1500 నుంచి 2400..!

జవాన్ : జవాన్ క్రేజ్ మాములుగా లేదు.. ఒక్క టికెట్ 1500 నుంచి 2400..!

బాలీవుడ్ బాద్ షారూఖ్ ఖాన్ నటించిన చిత్రం జవాన్. తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కించిన ఈ చిత్రంలో నయనతార కథానాయిక.

జవాన్ : జవాన్ క్రేజ్ మాములుగా లేదు.. ఒక్క టికెట్ 1500 నుంచి 2400..!

జవాన్

జవాన్ అడ్వాన్స్ టిక్కెట్ బుకింగ్స్: బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ నటించిన చిత్రం ‘జవాన్’. తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కించిన ఈ చిత్రంలో నయనతార కథానాయిక. దీపికా పదుకొణె అతిధి పాత్రలో కనిపించనుండగా, ప్రియమణి, అమృత అయ్యర్ మరియు సన్యా మల్హోత్రా కీలక పాత్రలు పోషించనున్నారు. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి విలన్‌గా నటిస్తున్నాడు. హిందీ, తమిళం, తెలుగు భాషల్లో సెప్టెంబర్ 7న విడుదల కానున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

ఉపాసన : ఇంతకంటే ఇంకేం అక్కర్లేదు.. ఆనందంలో ఉపాసన.. క్లిమ్‌కారాన్ని చూశావా..?

ఈ నేప‌థ్యంలో ఇటీవ‌ల అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ ప్రారంభ‌మయ్యాయి. పఠాన్ తర్వాత షారుక్ ఖాన్ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ తెలిపిన వివరాల ప్రకారం.. అడ్వాన్స్ బుకింగ్ చేసిన గంటలోపే 42 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. పీవీఆర్‌, ఐఎన్‌ఎక్స్‌లో 32,750, సినీపోలీస్‌లో 8,750 టిక్కెట్లు అమ్ముడయ్యాయని తెలిపారు.

యేందిరా ఈ పంచాయితి: ‘ఏందిరా ఈ పంచాయితీ’ చిత్రంలోని ‘ఏమో ఏమో’ పాట విడుదలైంది.

ఇదిలా ఉండగా.. బుక్ మై షో ప్రకారం టిక్కెట్ ధరలు ఎక్కువగా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఒక్కో టికెట్ రూ.1600 నుంచి రూ.2400 వరకు ఉంది. ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్, చండీగఢ్, చెన్నై, పూణే వంటి నగరాల్లో టిక్కెట్ ధరలు ఎక్కువగా ఉన్నాయి. కాగా, ఈ చిత్రంలో షారుక్ ఖాన్ రెండు పాత్రల్లో కనిపించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *