చంద్రబాబు క్వాష్ పిటిషన్: క్వాష్ పిటిషన్ డిస్మిస్.. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు చంద్రబాబు..!

చంద్రబాబు క్వాష్ పిటిషన్: క్వాష్ పిటిషన్ డిస్మిస్.. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు చంద్రబాబు..!

హైకోర్టు తీర్పుపై టీడీపీ సీనియర్ నేతలు చర్చిస్తున్నారు. ఎలా ముందుకు వెళ్లాలా అని ఆలోచిస్తున్నారు. ఎంత లీగల్ గా.. చంద్రబాబు క్వాష్ పిటిషన్

చంద్రబాబు క్వాష్ పిటిషన్: క్వాష్ పిటిషన్ డిస్మిస్.. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు చంద్రబాబు..!

చంద్రబాబు క్వాష్ పిటిషన్

చంద్రబాబు క్వాష్ పిటిషన్ – సుప్రీంకోర్టు: చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో టీడీపీ ఉంది. సోమవారం సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశాలున్నాయి. చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు శుక్రవారం (సెప్టెంబర్ 22) తీర్పు ఇచ్చింది. ఏపీ హైకోర్టు 68 పేజీలతో తీర్పు వెలువరించింది.

ఇది కూడా చదవండి..చంద్రబాబు ఇంటరాగేషన్ : సీఐడీ కస్టడీలో చంద్రబాబు..కస్టడీలో ఉన్న సీఐడీ ఏయే అంశాలపై ప్రశ్నలు సంధించింది?.. విచారణ ఎలా ఉండబోతోంది?

హైకోర్టు తీర్పుపై టీడీపీ సీనియర్ నేతలు అంతా చర్చించుకుంటున్నారు. ఎలా ముందుకు వెళ్లాలా అని ఆలోచిస్తున్నారు. న్యాయ పరంగా ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై చర్చిస్తున్నారు. టీడీపీ న్యాయవాది లక్ష్మీనారాయణ రాజమండ్రి వెళ్లారు. సెంట్రల్ జైలులో చంద్రబాబును కలిశారు. చంద్రబాబు అభిప్రాయం మేరకే ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. హైకోర్టులో మరో అవకాశం ఉంది. డివిజన్ బెంచ్‌లో అప్పీలు చేసుకునే అవకాశం ఉంది. లేదా సుప్రీం కోర్టులో క్వాష్ పిటిషన్ వేసే అవకాశం ఉంది. ఈ రెండు అంశాలను పార్టీ విభాగం పరిశీలిస్తోంది. దీనికి సంబంధించి హైకోర్టు తీర్పు కాపీని న్యాయవాది సిద్ధార్థ లూత్రా పరిశీలించారు.

హైకోర్టు కీలక వ్యాఖ్యలు..
కాగా, చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. “కేసు కీలక దశలో ఉంది. ఈ సమయంలో జోక్యం చేసుకోలేం. దాదాపు 140 మంది సాక్షులను సీఐడీ ప్రశ్నించింది. ఇంత చేసి ఇప్పుడు విచారణను నిలిపివేయడం సరికాదు. దర్యాప్తు సంస్థకు స్వేచ్ఛ ఇవ్వాలి” అని తీర్పు వెల్లడించింది. .

మరి.. చంద్రబాబు ఏం చేస్తారు?
స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఒకేరోజు రెండు ఎదురుదెబ్బలు తగిలాయి. చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. విజయవాడ ఏసీబీ కోర్టు రెండు రోజుల పాటు సీఐడీ కస్టడీకి అనుమతించింది. మరోవైపు చంద్రబాబు రిమాండ్‌ను కోర్టు రెండు రోజులు పొడిగించింది. దీంతో టీడీపీ శ్రేణులు అవాక్కయ్యారు. మరి టీడీపీ నేతలు ఏం చేస్తారు? అనేది ఆసక్తికరంగా మారింది. శని, ఆదివారాల నేపథ్యంలో సోమవారం (సెప్టెంబర్ 25) సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం లేదా హైకోర్టు డివిజన్ బెంచ్‌కు వెళ్లే అవకాశాలున్నాయి. లేదంటే ఏసీబీ కోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *