– సిరుగుప్పలో టీడీపీ, జనసేన అభిమానులు తరలివచ్చారు
బళ్లారి/ సిరుగుప్ప (బెంగళూరు), (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ నేతలు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుపై రాష్ట్రంలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబు మద్దతు రోజురోజుకూ పెరుగుతోంది. చంద్రబాబు అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ గురువారం బళ్లారి జిల్లా సిరుగుప్ప తాలూకాలో ప్రజా సంఘాలు, మహిళలు నిరసన ర్యాలీలు చేపట్టారు. ముందుగా సిరుగుప్ప పట్టణంలోని ఉన్నత పాఠశాలకు చేరుకున్న అభిమానులు అక్కడ సభ నిర్వహించి మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి గాంధీ సర్కిల్కు చేరుకున్నారు. నిరసనకు మద్దతుగా హాజరైన కర్నూలు జిల్లా టీడీపీ నాయకులు కోట్ల సుజాతమ్మ, కొల్లు శ్రీనివాసులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఓ సైకో అని, ఆయన రాక్షస పాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. అక్కడి అక్రమాలు, బెదిరింపులు, దౌర్జన్యాల వల్ల తాలూకా ప్రజలు పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారని అన్నారు. అక్రమ కేసులు బనాయించినా చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యంలా బయటకు వస్తారన్నారు. నిత్యం ఏపీ అభివృద్ధి గురించే ఆలోచించే చంద్రబాబు ఏ తప్పూ చేయలేదన్నారు.
కర్ణాటకలో చంద్రబాబుపై చూపిస్తున్న ప్రేమను ప్రజలకు కృతజ్ఞతలు చెప్పాలన్నారు. కమ్మసంఘం తాలూకా అధ్యక్షుడు జాలాది రాధాకృష్ణ, మాజీ అధ్యక్షుడు కోనేరు గోపాల్ కృష్ణ, ఎం.ప్రసాదరావు, గౌరవాధ్యక్షులు పొల్లి శ్రీనివాసులు, ఉపాధ్యక్షుడు తాతినేని ప్రసాద్, కార్యదర్శి పోతుగుంట సత్యనారాయణ, సంయుక్త కార్యదర్శి ఎం.ప్రసాదరావు, యార్లగడ్డ సత్యనారాయణ. బళ్లారి MRR ప్రసాద్, మేకా శ్రీనివాసరావు, N మురళి, పొట్టిపాటి చౌదరి, రమేష్ బాబు, కిరణ్ కుమార్, తదితరులు, జనసేన, నందమూరు, BC, దేవినగర్ క్యాంపు, శేషాద్రి నగర్ క్యాంపు, నందిపురం క్యాంపు, శ్రీనగర్ క్యాంపు, ముద్దత్తనూర్ క్యాంపు, పట్టాన ప్రముఖుడు, ఉసేన్సబ్, బసవ రాజప్ప, దళిత సంఘాలు, బీసీ సంఘాలు, మైనార్టీ సంఘాలు, టీడీపీ అభిమానులు, కార్యకర్తలు. ఈ ర్యాలీలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు, చంద్రబాబు నాయుడు అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
నవీకరించబడిన తేదీ – 2023-09-22T11:45:36+05:30 IST