హైదరాబాద్, బెంగళూరుతో పాటు వివిధ ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఏఎంఆర్ కంపెనీ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. AMR గ్రూప్

AMR గ్రూప్పై ఐటీ దాడులు
ఏఎంఆర్ గ్రూప్పై ఐటీ దాడులు : ఏఎంఆర్ కన్స్ట్రక్షన్స్ కంపెనీలపై ఐటీ దాడులు ముగిశాయి. నాలుగు రోజులుగా ఐటీ, ఈసీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సుమారు రూ.15 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. నగదుకు సంబంధించి పూర్తి ఆధారాలు సేకరించారు. బెంగళూరులోని వివిధ పార్టీలకు ఏఎంఆర్ కంపెనీ డబ్బులు పంపుతున్నట్లు గుర్తించారు.
హైదరాబాద్, బెంగళూరుతో పాటు వివిధ ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఏఎంఆర్ కంపెనీ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
ఇది కూడా చదవండి: బీజేపీ తొలిజాబితాలో హేమాహేమీల పేర్లు లేకపోగా.. వారంతా పార్లమెంటు సభ్యులేనా?
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ నేపథ్యంలో అటు పోలీసులు, ఇటు ఎన్నికల సంఘం అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో దాదాపు రూ.15 కోట్ల నగదు పట్టుబడింది. ఇంత మొత్తం ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై ఆధారాలు సేకరించారు. పోలీసులు, ఈసీ అధికారులు, ఐటీ అధికారులు ఏఎంఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీ నుంచి నగదు బదిలీ చేసినట్లు గుర్తించారు. గత నాలుగు రోజుల నుంచి ఏఎంఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీలు, కంపెనీ డైరెక్టర్ల నివాసాల్లో అధికారులు సోదాలు చేశారు.
బెంగళూరు నుంచి తెలంగాణతో పాటు ఎన్నికలు జరుగుతున్న 5 రాష్ట్రాలకు ఈ కంపెనీ నుంచి పెద్ద మొత్తంలో పార్టీ నిధులు ఇచ్చేందుకు డబ్బు తరలిస్తున్నట్లు ఐటీ అధికారులు గుర్తించారు. గత నాలుగు రోజులుగా హైదరాబాద్, బెంగళూరుతో పాటు దాదాపు 12 చోట్ల ఈసీ, ఐటీ అధికారులు సోదాలు చేశారు. నగదుతోపాటు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
ఇది కూడా చదవండి: తెలంగాణ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల.. గజ్వేల్ నుంచి కేసీఆర్ పోటీ
బెంగళూరులోని కొందరు కాంగ్రెస్ నేతల నుంచి ఈ డబ్బు బదిలీ అయినట్లు తెలుస్తోంది. వారు నిజంగా ప్రమేయం ఉన్నారా? లేదా? అని తేల్చేందుకు ఆధారాలను గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు.