ఒడిశా నుంచి హైదరాబాద్కు బస్సులో గంజాయి తరలిస్తున్న వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒడిశా, విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాల నుంచి ట్రావెల్ బస్సుల్లో గంజాయి సరఫరా అవుతుందన్న సమాచారంతో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు.

గంజాయి స్వాధీనం చేసుకున్నారు
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా వరుస తనిఖీలు చేపట్టారు. సోదాల్లో భారీగా నగదు, మద్యం, బంగారం, వెండి, ఇతర విలువైన వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా హైదరాబాద్లో భారీగా నగదు, మద్యం పట్టుబడుతున్నాయి. తాజాగా హైదరాబాద్లో భారీగా గంజాయి పట్టుబడింది. 12 కిలోల గంజాయిని ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
అబ్దుల్పూర్ మెట్లో ట్రావెల్ బస్సును తనిఖీ చేసిన ఎక్సైజ్ అధికారులు 12 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి హైదరాబాద్కు బస్సులో గంజాయి తరలిస్తున్న వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒడిశా, విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాల నుంచి ట్రావెల్ బస్సుల్లో గంజాయి సరఫరా అవుతుందన్న సమాచారంతో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు.
కాగా, ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి రూ.307 కోట్ల ఆస్తులను సీజ్ చేసినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అక్టోబర్ 9 నుంచి 21వ తేదీ వరకు పట్టుబడిన నగదు, మద్యం, మత్తు పదార్థాలు, బంగారు, వెండి ఆభరణాలు తదితర వస్తువుల వివరాలను ఎన్నికల సంఘం ప్రకటించింది.ఎన్నికల నిబంధనల అమలుతో పోలీసులు వాహన తనిఖీలను ముమ్మరం చేశారు.
ఇప్పటి వరకు పట్టుబడిన నగదు, మద్యం, మత్తు పదార్థాలు, ఇతర వస్తువుల వివరాలను ఎన్నికల సంఘం ప్రకటించింది. సుమారు రూ.106 కోట్ల నగదు, రూ.13 కోట్ల 59 లక్షల విలువైన 72,300 లీటర్ల మద్యం, రూ.15 కోట్ల 24 లక్షల విలువైన గంజాయి, రూ.145 కోట్ల 68 లక్షల విలువైన బంగారం, వెండి, వజ్రాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు రూ.27 కోట్ల విలువైన ల్యాప్టాప్లు, వాహనాలు, కుక్కర్లు, చీరలు, బియ్యం, క్రీడా సామగ్రిని సీజ్ చేసినట్లు ప్రధాన ఎన్నికల సంఘం వెల్లడించింది.