వన్డే ప్రపంచకప్లో టీమిండియా మరో కీలక పోరుకు సిద్ధమైంది. వరుసగా 5 విజయాలతో దూసుకెళ్తున్న రోహిత్ సేన ఆదివారం డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్తో తలపడనుంది. లక్నోలోని ఎఖానా స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.

లక్నో: వన్డే ప్రపంచకప్లో టీమిండియా మరో కీలక పోరుకు సిద్ధమైంది. వరుసగా 5 విజయాలతో దూసుకెళ్తున్న రోహిత్ సేన ఆదివారం డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్తో తలపడనుంది. లక్నోలోని ఎఖానా స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని భారత జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఒకే ఒక్క మ్యాచ్లో విజయం సాధించిన ఇంగ్లండ్ పాయింట్ల పట్టికలో 10వ ర్యాంక్తో అట్టడుగున కొనసాగుతోంది. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉన్నప్పటికీ ఇంగ్లిష్ జట్టును ఏమాత్రం తక్కువ అంచనా వేయలేం. మ్యాచ్ విన్నర్లతో ఇంగ్లండ్ ఏ క్షణంలోనైనా ఫామ్ లోకి వచ్చే అవకాశం ఉంది. ఇంగ్లండ్ను తేలిగ్గా తీసుకోకుండా భారత్ అప్రమత్తంగా ఉండాలని విశ్లేషకులు సూచిస్తున్నారు.
రెండు జట్ల మధ్య గతంలో తలపెట్టిన రికార్డుల విషయానికొస్తే.. వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటివరకు భారత్, ఇంగ్లండ్ జట్లు 8 సార్లు తలపడ్డాయి. ఈ పోటీలో ఇంగ్లండ్ స్వల్పంగా పైచేయి సాధించింది. ఇంగ్లీష్ జట్టు 4 సార్లు గెలిచింది. భారత్ 3 సార్లు గెలిచింది. 2011లో భారత్లో జరిగిన ప్రపంచకప్లో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ టైగా ముగిసింది. ఇరు జట్ల మధ్య జరిగిన పోటీలో ఇరు జట్ల అత్యధిక స్కోరు 338 కాగా.. 2011లో టైగా ముగిసిన మ్యాచ్లో ఇరు జట్లు ఈ స్కోరును సాధించడం గమనార్హం. అయితే గత ప్రపంచకప్లో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో టీమిండియా 31 పరుగుల తేడాతో ఓడిపోయింది. వన్డే ఫార్మాట్లో ఇరు జట్లు ఇప్పటి వరకు మొత్తం 106 మ్యాచ్లు ఆడాయి. ఇందులో టీమ్ ఇండియా ఆధిపత్యం ప్రదర్శించింది. భారత జట్టు అత్యధికంగా 57 మ్యాచ్లు గెలవగా.. ఇంగ్లండ్ 44 మ్యాచ్ల్లో విజయం సాధించింది. రెండు మ్యాచ్లు టై కాగా, 3 మ్యాచ్లు రద్దయ్యాయి.
నవీకరించబడిన తేదీ – 2023-10-29T12:28:17+05:30 IST