అలనాటి మేటి నటుడు టీఎస్ బాలయ్య కుమారుడు రఘు బాలయ్య అలియాస్ జూనియర్ బాలయ్య(70) గురువారం ఉదయం తుది శ్వాస విడిచారు. శ్వాసకోశ సమస్యలతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

తమిళ నటుడు జూనియర్ బాలయ్య
దివంగత నటుడు టీఎస్ బాలయ్య కుమారుడు రఘు బాలయ్య అలియాస్ జూనియర్ బాలయ్య(70) గురువారం ఉదయం తుది శ్వాస విడిచారు. శ్వాసకోశ సమస్యలతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. స్థానికంగా నివాసముంటున్న వంజినాథన్ స్ట్రీట్లోని ఆయన నివాసంలో సినీ ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం పార్థివదేహాన్ని ఉంచిన అంత్యక్రియలు గురువారం సాయంత్రం పూర్తయ్యాయి. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులతో పాటు నడిగర్ సంఘం నిర్వాహకులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. (జూనియర్ బాలయ్య ఇక లేరు)
1975లో విడుదలైన ‘మేల్నట్టు మరుమగల్’ సినిమా ద్వారా కోలీవుడ్కు పరిచయమైన జూనియర్ బాలయ్య… ‘గోపుర వాసలిలే’, ‘కరగట్టకారన్’, ‘చిన్నతాయి’, ‘సంగం’, ‘విజేత’ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు. హీరో అజిత్ నటించిన ‘నేర్కొండపర్వై’ సినిమాలో కూడా ఓ ముఖ్య పాత్ర పోషించాడు. చివరిగా 2011లో విడుదలైన ‘ఎన్నంగ సర్ ఉంగ గాట్’ సినిమాలో నటించిన ఆయన.. అప్పటి నుంచి చిత్ర పరిశ్రమకు దూరంగా ఉన్నారు. సినిమాతో పాటు ‘చిట్టి’, ‘చిన్న పాప పెరియ పాప’ వంటి పలు టీవీ సీరియల్స్లో కూడా నటించారు.
రఘు బాలయ్య అలియాస్ జూనియర్ బాలయ్య మరణవార్త తెలుసుకున్న పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు. రజనీకాంత్, కమల్ హాసన్, అజిత్ కుమార్ వంటి స్టార్ హీరోలు రఘు బాలయ్య చాలా మంచి నటుడని, ఆయన మరణం కోలీవుడ్ ఇండస్ట్రీకి తీరని లోటు అని అన్నారు.
ఇది కూడా చదవండి:
========================
****************************************
నవీకరించబడిన తేదీ – 2023-11-03T15:04:45+05:30 IST