లోక్సభ నీతి కమిటీ సిఫార్సు!
ఆమె చర్యలు అభ్యంతరకరం.. జుగుప్సాకరమైనవి.. అనైతికం.. నేరపూరితం
మహువా మోయిత్రా మరియు దర్శన్ హిరానందాని మధ్య క్విడ్ ప్రోకో
వారిద్దరిపై కేంద్రం లోతైన విచారణ జరిపించాలి.. కమిటీ నివేదిక
మహువా అవినీతిపై సీబీఐ విచారణకు లోక్పాల్ ఆదేశం: దూబే
అదానీ బొగ్గు కుంభకోణంపై మొదట కేసు నమోదు చేయాలి: మొయిత్రా
న్యూఢిల్లీ, నవంబర్ 8:‘ప్రశ్న నోట్’ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా సభ్యత్వాన్ని రద్దు చేయాలని లోక్సభ ఎథిక్స్ కమిటీ స్పీకర్ ఓం బిర్లాకు నివేదించనున్నట్లు తెలుస్తోంది. అదానీ గ్రూప్ను, ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని ప్రశ్నలు సంధించేందుకు ప్రముఖ వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి మహువా రూ.2 కోట్లు, ఐఫోన్ వంటి ఖరీదైన బహుమతులు అందుకున్నారని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే లోక్సభ స్పీకర్కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ విషయం దేశ వ్యాప్తంగా రాజకీయ దుమారం రేపింది. దీనిపై గత వారం లోక్సభ ఎథిక్స్ కమిటీ మహువాను ప్రశ్నించింది. మొయిత్రా, హీరానందానీల మధ్య జరిగిన లావాదేవీలను క్విడ్ ప్రోకోగా కమిటీ పేర్కొన్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ కథనాల ప్రకారం.. మహువా చర్యలు అత్యంత అభ్యంతరకరం, హేయమైనవి, అనైతికం, నేరపూరితమైనవి అని కమిటీ తప్పుపట్టింది. ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై సంస్థాగతంగా, చట్టబద్ధంగా లోతైన విచారణ జరపాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. విచారణకు నిర్ణీత కాలపరిమితి ఉండాలని కూడా పేర్కొంది. ఇందుకు సంబంధించి 500 పేజీలతో నివేదికను సిద్ధం చేశారు. కాగా, వచ్చే శీతాకాల సమావేశంలో ఓం బిర్లాకు నివేదిక సమర్పించనున్నారు. దీనిపై చర్చించి చర్యలు తీసుకుంటామన్నారు. కాగా, మహువాపై జరిపిన విచారణకు సంబంధించి కమిటీ తుది నివేదికను సిద్ధం చేసింది. దీనికి గురువారం సాయంత్రం ఓటింగ్ జరగనుంది. 15 మంది సభ్యులతో కూడిన ఎథిక్స్ కమిటీలో బీజేపీ నుంచి ఏడుగురు, కాంగ్రెస్ నుంచి ముగ్గురు ఉన్నారు. బీఎస్పీ, శివసేన, వైసీపీ, సీపీఎం, జేడీయూ నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. శివసేనతో కలిస్తే 8 మంది బీజేపీకి చెందిన వారు కావడంతో నివేదిక ఆమోదం పొందుతుందని భావిస్తున్నారు. కాగా, తనపై వచ్చిన ఆరోపణలను మొయిత్రా తీవ్రంగా ఖండించారు. ఆరోపణలు అవాస్తవమని, పరువు నష్టం కలిగించేలా ఉన్నాయని పేర్కొన్నారు. దూబే, న్యాయవాది జై అనంత్ డెహ్ద్రాయ్లకు నోటీసులు పంపారు.
మహువాపై సీబీఐ!
మొయిత్రాపై వచ్చిన అవినీతి ఆరోపణలపై సీబీఐ దర్యాప్తునకు లోక్పాల్ ఆదేశించినట్లు దూబే ట్వీట్ చేశారు. దేశ భద్రతను పణంగా పెట్టి అవినీతికి పాల్పడుతున్న మహువాపై తాను చేసిన ఫిర్యాదు ఆధారంగా లోక్పాల్ స్పందించినట్లు ఆయన తెలిపారు. అయితే ఈ విషయమై లోక్పాల్ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ‘సిబిఐ దర్యాప్తు’ అంటూ దూబే ట్వీట్పై మహువా స్పందించారు. రూ.13 వేల కోట్ల బొగ్గు కుంభకోణానికి పాల్పడిన అదానీపై ముందుగా సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆ తర్వాత విచారణను స్వాగతిస్తున్నట్లు ‘ఎక్స్’లో పోస్ట్ చేశాడు.