‘న్యూస్క్లిక్ టెర్రర్ కేసులో’ వ్యాపారవేత్త మరియు అమెరికన్ మిలియనీర్ నెవిల్ రాయ్ సింఘమ్కు ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) సమన్లు జారీ చేసింది. భారత్లో చైనా అనుకూల ప్రచారం కొనసాగుతోందని నోటీసుల్లో పేర్కొన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

న్యూఢిల్లీ: ‘న్యూస్క్లిక్ టెర్రర్ కేసులో’ వ్యాపారవేత్త మరియు అమెరికన్ మిలియనీర్ నెవిల్ రాయ్ సింఘమ్కు ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) సమన్లు జారీ చేసింది. భారత్లో చైనా అనుకూల ప్రచారం కొనసాగుతోందని నోటీసుల్లో పేర్కొన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సింఘమ్ ప్రస్తుతం చైనాలోని షాంఘైలో ఉన్నారు. సింఘం వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు స్థానిక కోర్టు ఎల్ఆర్ (లెటర్స్ రోగేటరీ) జారీ చేయడంతో ఈ తాజా సమన్లు పంపినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) నిబంధనల కింద తాజాగా సమన్లు జారీ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ-మెయిల్ ద్వారా నోటీసులు పంపారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయంతో చైనా ప్రభుత్వ మార్గాల ద్వారా ఈ నోటీసులు పంపబడ్డాయి. సింఘమ్కు ఈడీ నోటీసులు జారీ చేయడం ఇది రెండోసారి. 2021లో దర్యాప్తు ప్రారంభించగా, ఈడీ 2022లో తొలిసారి నోటీసులు జారీ చేసింది.
కొన్ని నెలల క్రితం సింగం వార్తల్లో నిలిచాడు. న్యూయార్క్ టైమ్స్ లో ప్రచురితమైన కథనం ఆధారంగా ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగారు. ED అందించిన ఆధారాలు ఉన్నందున పోలీసులు న్యూస్క్లిక్ వ్యవస్థాపకులతో పాటు సింఘమ్పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. న్యూయార్క్ టైమ్స్ కథనం ‘న్యూస్క్లిక్’ అనేది గ్లోబల్ నెట్వర్క్ అని, ఇది సింఘమ్ నుండి నిధులు పొందుతుందని పేర్కొంది. చైనా ప్రభుత్వ మీడియా యంత్రాంగంతో సింఘమ్కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని పేర్కొంది.
నవీకరించబడిన తేదీ – 2023-11-16T13:21:10+05:30 IST