రాయ్పూర్: చత్తీస్గఢ్ కొత్త ముఖ్యమంత్రిగా విష్ణు దేవ్ సాయిని ఛత్తీస్గఢ్ బీజేపీ శాసనసభా పక్షం ఏకగ్రీవంగా ఎన్నుకుంది. దీంతో గిరిజన నేతను సీఎం చేస్తానని ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర చెప్పిన మాట నిజమైంది. గిరిజన నాయకుడిగా పేరుగాంచిన విష్ణుదేవ్ సాయి మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్కు సన్నిహిత మిత్రుడు కూడా. 59 ఏళ్ల విష్ణు దేవ్ సాయి కేంద్ర మాజీ మంత్రిగా, లోక్సభ ఎంపీగా, పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.
అనూహ్యంగా తెరపైకి..
ఛత్తీస్గఢ్ సీఎం ఎవరన్నదానిపై వారం రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడి ఆదివారం సీఎంగా విష్ణు దేవ్సాయి పేరు ప్రకటించడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. సీఎం అభ్యర్థుల పేర్లలో ముందుగా విష్ణు దేవ్ పేరు వినిపిస్తున్నా.. రమణ్ సింగ్, రేణుగా సింగ్ పేర్లు మాత్రం ముందు వరుసలో ఉన్నాయి. అయితే అనూహ్యంగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో పార్టీ శాసనసభా పక్ష సమావేశం నిర్వహించిన కేంద్ర పరిశీలకులు విష్ణుదేవ్ సాయి పేరును ముఖ్యమంత్రిగా అధికారికంగా ప్రకటించారు.
విష్ణుదేవ్ ఎవరు..?
1. విష్ణుదేవ్ సాయి 2020 నుండి 2022 వరకు చత్తీస్గఢ్ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా పనిచేశారు.
2. అజిత్ జోగి తర్వాత ఛత్తీస్గఢ్లో రెండవ గిరిజన ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి. షెడ్యూల్ ట్రైబ్స్ (ఎస్టీ)కి చెందిన అజిత్ జోగి 2019లో ముఖ్యమంత్రి.
3. 2014లో నరేంద్ర మోదీ తొలిసారి ప్రధాని అయినప్పుడు విష్ణు దేవ్ సాయి ఆయన మంత్రివర్గంలో ఉక్కు శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు.
4. విష్ణుదేవ్ సాయి రాయ్గఢ్ నుండి లోక్సభ సభ్యుడు.
5. విష్ణుదేవ్ సాయి మధ్యప్రదేశ్ నుండి ఛత్తీస్గఢ్ విడిపోవడానికి ముందు 1990-98 మధ్యప్రదేశ్ అసెంబ్లీ సభ్యునిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు.
6. ఇటీవల ముగిసిన ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికలలో, అతను కుంకూరి నియోజకవర్గం నుండి పోటీ చేసి సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే యుడి మింజ్పై విజయం సాధించారు.
7. విష్ణుదేవ్ సాయి 1999 నుండి 2014 వరకు వరుసగా నాలుగు సార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు.
నవీకరించబడిన తేదీ – 2023-12-10T17:23:45+05:30 IST