వ్యక్తిగత కారణాల వల్ల..
న్యూఢిల్లీ/హైదరాబాద్: ఇంగ్లండ్తో మరో రెండు రోజుల్లో ఐదు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుండగా, టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ అనూహ్యంగా తొలి రెండు టెస్టుల నుంచి వైదొలిగాడు. అయితే వ్యక్తిగత కారణాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. తొలి టెస్టు కోసం కోహ్లీ ఆదివారం హైదరాబాద్ చేరుకున్నాడు. ఇరు జట్ల మధ్య గురువారం నుంచి హైదరాబాద్లో తొలి టెస్టు ప్రారంభం కాగా, ఫిబ్రవరి 2 నుంచి విశాఖపట్నంలో రెండో టెస్టు జరగనుంది.’ఇంగ్లండ్తో జరిగే తొలి రెండు టెస్టుల్లో ఆడలేనని బీసీసీఐకి విరాట్ విజ్ఞప్తి చేశాడు. దీనిపై కెప్టెన్ రోహిత్, టీమ్ మేనేజ్మెంట్, సెలెక్టర్లతో కూడా మాట్లాడాడు. దేశం తరఫున ఆడటం గర్వకారణమైనా.. బీసీసీఐ కూడా విరాట్ నిర్ణయాన్ని గౌరవిస్తూ అతనికి మద్దతిస్తోంది. ఈ క్లిష్ట సమయంలో అతని గోప్యతకు భంగం కలిగించవద్దని మేము మీడియా మరియు అభిమానులను కూడా అభ్యర్థిస్తున్నాము. అలాగే ఇంగ్లండ్తో సిరీస్ గెలిచేందుకు జట్టుకు అండగా నిలవాలి’ అని బోర్డు కార్యదర్శి జైషా అన్నారు.
రేసులో పాటిదార్, సర్ఫరాజ్!
ఇంగ్లండ్తో జరిగే తొలి రెండు టెస్టులకు విరాట్ స్థానంలో రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్లను ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నారు. వీరిద్దరూ భారత్ ‘ఎ’ తరఫున మంచి ప్రదర్శన చేస్తున్నారు. ఇంగ్లండ్ లయన్స్పై పాటిదార్ 151 పరుగులు చేయగా, సర్ఫరాజ్ హాఫ్ సెంచరీ చేశాడు. పుజారా పేరు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందని సమాచారం.
ఏం జరుగుతోంది
ఇటీవలి కాలంలో వ్యక్తిగత కారణాలతో విరాట్ కోహ్లీ జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. గతంలో ఇలాంటి పరిస్థితి కనిపించలేదు. అఫ్గానిస్థాన్తో జరిగే మూడు టీ20ల సిరీస్కు ఎంపికైనప్పటికీ.. అకస్మాత్తుగా తొలి మ్యాచ్ నుంచి వైదొలిగాడు. అంతకు ముందు, అతను అదే కారణంతో దక్షిణాఫ్రికా పర్యటనలో ఇంట్రా-స్క్వాడ్ ప్రాక్టీస్ గేమ్లను వదిలి లండన్కు వెళ్లాడు. మరోవైపు అతడిని చుట్టుముట్టే కుటుంబ సమస్యలు ఏంటి అనే ప్రశ్నలు అభిమానులను కలవరపెడుతున్నాయి.