బరోడా-ముంబై జట్ల మధ్య జరిగిన రంజీ క్వార్టర్ ఫైనల్లో సంచలన ప్రదర్శన నమోదైంది. ముంబై జట్టు పదో బ్యాట్స్మెన్ తనుష్ కొటియన్ (120 నాటౌట్), చివరి బ్యాట్స్మెన్ తుషార్ దేశ్పాండే (123) సెంచరీలు చేసి రంజీస్లో చరిత్ర సృష్టించారు.

ఎవరితో
విదర్భ X మధ్యప్రదేశ్ ముంబై X తమిళనాడు
మార్చి 2 నుంచి సెమ్స్.
-
తనుష్-తుషార్ రికార్డు
-
సెమీస్లో ముంబై, విదర్భ
ముంబై: బరోడా-ముంబై జట్ల మధ్య జరిగిన రంజీ క్వార్టర్ ఫైనల్లో సంచలన ప్రదర్శన నమోదైంది. ముంబై జట్టు పదో బ్యాట్స్మెన్ తనుష్ కొటియన్ (120 నాటౌట్), చివరి బ్యాట్స్మెన్ తుషార్ దేశ్పాండే (123) సెంచరీలు చేసి రంజీలో చరిత్ర సృష్టించారు. మొత్తంమీద ఫస్ట్ క్లాస్ క్రికెట్లో చివరి ఇద్దరు బ్యాట్స్మెన్ ఒకే ఇన్నింగ్స్లో సెంచరీలు చేయడం ఇది రెండోసారి మాత్రమే. 1946లో, భారత ఆటగాళ్లు చందు సర్వాతే-షట్ బెనర్జీ సర్రే కౌంటీపై ఓవల్లో ఈ ఘనత సాధించారు. ఈ ప్రయత్నంలో బరోడాపై చివరి వికెట్కు 232 పరుగులు జోడించడం విశేషం. అయితే కేవలం ఒక్క పరుగు తేడాతో ఈ వికెట్లో అత్యధిక షేర్ రికార్డును అందుకోలేకపోయారు. వీరి ఆటతో ముంబై రెండో ఇన్నింగ్స్లో 599 పరుగులు చేసింది. 606 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బరోడా రెండో ఇన్నింగ్స్లో టీ విరామ సమయానికి 121/3తో నిలిచింది. ఫలితంగా మ్యాచ్ డ్రా కావడంతో ముంబై 36 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో సెమీస్ చేరింది.
కర్ణాటకకు షాక్
నాగ్పూర్: కర్ణాటకతో జరిగిన మరో క్వార్టర్లో విదర్భ 128 పరుగుల తేడాతో సెమీఫైనల్కు చేరుకుంది. 371 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కర్ణాటక ఆఖరి రోజైన మంగళవారం కుప్పకూలింది. ఓవర్నైట్ స్కోరు 103/1తో పటిష్టంగా కనిపించినప్పటికీ, హర్ష్ దూబే, ఆదిత్య చెరో నాలుగు వికెట్లు పడగొట్టడంతో జట్టు 243 పరుగులు మాత్రమే చేయగలిగింది. మయాంక్ (70) టాప్ స్కోరర్. విదర్భ తొలి ఇన్నింగ్స్లో 460 పరుగులు, రెండో ఇన్నింగ్స్లో 196 పరుగులు చేయగా, కర్ణాటక తొలి ఇన్నింగ్స్లో 286 పరుగులు చేసింది.
నవీకరించబడిన తేదీ – ఫిబ్రవరి 28, 2024 | 03:45 AM