ఎంసెట్ ర్యాంక్లో ఇంటర్ మార్కుల వెయిటేజీ విధానాన్ని రద్దు చేస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు

చదువు
ఎంసెట్ ర్యాంకుల్లో ‘ఇంటర్’ వెయిటేజీ రద్దు
ఇక నుంచి ర్యాంకులు ఎంసెట్ స్కోర్పై ఆధారపడి ఉంటాయి
ఈ ఏడాది నుంచే అమలు: విద్యాశాఖ ఉత్తర్వులు
హైదరాబాద్ , ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి): ఎంసెట్ ర్యాంక్లో ఇంటర్ మార్కుల వెయిటేజీ విధానాన్ని రద్దు చేస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆ శాఖ కార్యదర్శి వాకాటి కరుణ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయం రాబోయే సంవత్సరాల్లో కూడా వర్తిస్తుంది. ఇక నుంచి ఎంసెట్లో వచ్చిన మార్కుల ఆధారంగా ర్యాంకులను ప్రకటిస్తారు. రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్ కోర్సుల్లో సీట్లను భర్తీ చేసేందుకు ఎంసెట్ను నిర్వహిస్తున్నారు. గతంలో ఉన్న విధానం ప్రకారం ఎంసెట్లో వచ్చిన మార్కులను 75 శాతంగా పరిగణించి ఇంటర్లో వచ్చిన మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చి ర్యాంకులు ప్రకటిస్తారు. ఈ విధానం ద్వారా ఎంసెట్లో మార్కులు కాస్త తక్కువగా వచ్చినా ఇంటర్లో ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు ఎంసెట్ ర్యామ్లో మెరుగ్గా ఉంటారు. అయితే జాతీయ స్థాయిలో నిర్వహించే అనేక ప్రవేశ పరీక్షల్లో ఇంటర్మీడియట్ మార్కులకు వెయిటేజీ లేదు. అలాగే, కరోనా సమయంలో ఇంటర్ పరీక్షలు రద్దు చేయబడ్డాయి. ఆ సమయంలో వెయిటేజీని తొలగించారు. ఇప్పుడు ఇదే విధానాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
వృత్తి విద్యా కోర్సుల్లో 45 శాతం మార్కులు తప్పనిసరి.
వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశానికి ఇంటర్లో 45 శాతం మార్కులు సాధించాలనే నిబంధనను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరాలంటే ఇంటర్లో జనరల్ కేటగిరీ విద్యార్థులు 45 శాతం, రిజర్వేషన్ విద్యార్థులు 40 శాతం మార్కులు సాధించాలి. అయితే, వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశానికి 45 శాతం మార్కులు ఉండాలనే నిబంధనను కరోనా సమయంలో తొలగించారు. ఈ ఏడాది నుంచి మళ్లీ ఆ నిబంధనను అమలు చేయాలని నిర్ణయించారు.
నవీకరించబడిన తేదీ – 2023-04-20T12:39:37+05:30 IST