చియాన్ విక్రమ్, మాళవిక మోహనన్ జంటగా పా.రంజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘తంగళన్’ అప్డేట్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయని మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిందని విక్రమ్ తన ట్విట్టర్ వేదికగా కొన్ని ఫొటోలను కూడా షేర్ చేశాడు.

చియాన్ విక్రమ్ మరియు మాళవిక మోహనన్
చియాన్ విక్రమ్, మాళవిక మోహనన్ జంటగా పా.రంజిత్ దర్శకత్వం వహించిన ‘తంగళన్’ చిత్రానికి సంబంధించిన అప్డేట్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయని మేకర్స్ వెల్లడించారు. మొత్తం 118 రోజుల పాటు సాగిన ఈ సినిమా షూటింగ్ మంగళవారంతో ముగిసినట్లు చిత్ర బృందం అధికారికంగా వెల్లడించింది. ఈ సందర్భంగా విక్రమ్, మాళవిక తమ పాత్రల వేషధారణలో ఉండగా, దర్శకుడు రంజిత్ వారితో కలిసి ఉన్న ఫొటోను మీడియాకు విడుదల చేశారు.
కేజీఎఫ్ (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్-కేజీఎఫ్) నేపథ్యంలో పీరియాడికల్ మూవీగా ఈ సినిమా రూపొందుతోంది. బ్రిటిష్ హయాంలో కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ గోల్డ్ ఫ్యాక్టరీ, బంగారు గనుల్లో పనిచేసిన కార్మికులపై దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రముఖ నిర్మాత కెఇ జ్ఞానవేల్ రాజా తన సొంత నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ బ్యానర్పై భారీ బడ్జెట్తో దీన్ని రూపొందించారు. పా.రంజిత్ సొంత బ్యానర్ నీలం ప్రొడక్షన్స్ కూడా ఈ సినిమా నిర్మాణంలో పాలుపంచుకుంది. నిర్మాణానంతర కార్యక్రమాలను పూర్తి చేసిన ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. (తంగళన్ షూటింగ్ ముగిసింది)
ఈ మధ్య కాలంలో సక్సెస్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ గా వరుస అవకాశాలను చేజిక్కించుకుంటున్న జివి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ పూర్తయినందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ విక్రమ్ ట్వీట్ చేశాడు. ‘ఈ సినిమా కోసం 118 రోజులు గొప్ప వ్యక్తులతో పనిచేశా. ఈ సినిమా అద్భుతమైన అనుభవాలను ఇచ్చింది. కొత్త ప్రపంచంలో గడిపినట్లు అనిపించింది.’
*******************************************
****************************************
*******************************************
*******************************************
****************************************
నవీకరించబడిన తేదీ – 2023-07-06T17:38:26+05:30 IST