మయోసైటిస్ చికిత్స కోసం సమంత అక్షరాలా 25 కోట్లు ఖర్చు చేసింది. పైగా ఆ డబ్బు కూడా ఓ స్టార్ హీరో దగ్గర అప్పుగా తీసుకున్నదే..

తన మైయోసైటిస్ చికిత్స కోసం 25 కోట్లు ఖర్చు చేయడంపై సమంత క్లారిటీ ఇచ్చింది
సమంత: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత కొంత కాలంగా మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతోంది. అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకునేందుకు ఏడాది పాటు సినిమాలకు విరామం ఇస్తున్నట్లు సమంత ఇటీవల ప్రకటించింది. ఇదిలావుంటే, తాజాగా ఓ వార్త మీడియా వర్గాల్లో వైరల్గా మారింది. అదేంటంటే.. ‘‘సమంత అక్షరాలా 25 కోట్లు మయోసైటిస్ చికిత్స కోసం ఖర్చు చేసి, ఆ డబ్బును ఓ స్టార్ హీరో దగ్గర అప్పుగా తీసుకుంది’’ అని పలు మీడియా కథనాలు రాశాయి.
చంద్రముఖి 2: చంద్రముఖిగా కంగనా లుక్ చూశారా?
అయితే ఈ వార్తలను సమంత తనదైన శైలిలో తోసిపుచ్చింది. ఆమె తన ఇన్స్టాగ్రామ్ కథనంలో, “మయోసిటిస్ చికిత్సకు 25 కోట్లు? మీతో ఎవరో చెడ్డ ఒప్పందం చేసుకున్నారు. దానికి నేను చాలా తక్కువ ఖర్చు చేస్తున్నాను. నేనే చూసుకోగలను’’ అని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇలాంటి వార్తలు రాసేవాళ్లకు ఓ సలహా కూడా ఇచ్చింది.‘‘మయోసైటిస్తో బాధపడేవాళ్లు చాలా మంది ఉన్నారు.. ఎలాంటి సమాచారం లేకుండా మీరు రాసే తప్పుడు రాతలను నమ్మి వెళ్లేవాళ్లు కూడా ఉన్నారు. భయంతో చికిత్స కోసం. కాబట్టి కొంచెం బాధ్యతగా ప్రవర్తించండి” అని ఆమె చెప్పింది.
నాగ చైతన్య: తండ్రికి తగిన కొడుకు.. అమ్మాయిల్లో మన్మథుడు..

తన మైయోసైటిస్ చికిత్స కోసం 25 కోట్లు ఖర్చు చేయడంపై సమంత క్లారిటీ ఇచ్చింది
కాగా సమంత ప్రస్తుతం ఇండోనేషియాలోని బాలిలో ఉంది. అక్కడ ఆమె సహజ చికిత్సలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఉదయాన్నే వ్యాయామాలు, యోగాలు, నేచురల్ థెరఫీలు తీసుకుంటూ, ప్రకృతి మధ్యలో గడుపుతూ మానసిక, శారీరక చికిత్స పొందుతున్నట్లు సమాచారం. సమంత నటించిన ఖుషి చిత్రం సెప్టెంబర్లో విడుదల కానుంది. విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్గా పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.