ఎన్నికల్లో ఆయన ఓటమిని కోరుకునే వారి సంఖ్య పెరిగింది. నేను ఓడిపోవాలని బయటివాళ్లతో పాటు సొంతవాళ్లు కూడా కోరుకుంటున్నారని రాజాసింగ్ అన్నారు.

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్: బీజేపీ బహిష్కృత నేత, గోషామహల్ నియోజకవర్గ ఎమ్మెల్యే రాజాసింగ్ అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. మళ్లీ సభకు వస్తానో లేదో తెలియదు. వచ్చే అసెంబ్లీలో నేను ఉండకపోవచ్చని అనుకుంటున్నాను. నేను ఉన్నా లేకపోయినా తెలంగాణలో ఏర్పాటైన ప్రభుత్వ ఆశీస్సులు తన నియోజకవర్గ ప్రజలపై ఎప్పుడూ ఉండాలని రాజాసింగ్ అన్నారు. ఎన్నికల్లో ఆయన ఓటమిని కోరుకునే వారి సంఖ్య పెరిగింది. నేను ఓడిపోవాలని సొంత వాళ్లతోపాటు బయటివాళ్లూ కోరుకుంటున్నారని రాజాసింగ్ సభా వేదికపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం గోషామహల్ నియోజకవర్గాన్ని పట్టించుకోకపోవడం బాధాకరమని రాజాసింగ్ అన్నారు. నియోజకవర్గంలోని సమస్యలు, తన పరిధిలో లేని పనులు, ప్రభుత్వం చేయాల్సిన పనులను వివిధ వేదికలపై, అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించినట్లు రాజేసింగ్ తెలిపారు.
తిరుపతి శ్రీవారి పార్వేట మండపాన్ని కూల్చివేసిన వారిపై చర్యలు తీసుకోవాలి : ఎమ్మెల్యే రాజాసింగ్
ఓ వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఎమ్మెల్యే రాజాసింగ్ను క్రమశిక్షణా చర్యల కింద పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా రాజాసింగ్పై బీజేపీ అధిష్టానం సస్పెన్షన్ను ఎత్తివేస్తుందని వార్తలు వచ్చాయి. కానీ బీజేపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో పాటు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాజాసింగ్కు టికెట్ ఇచ్చేందుకు బీజేపీ అధిష్టానం వెనుకంజ వేస్తోందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా మంత్రి హరీశ్ రావుతో రాజాసింగ్ భేటీ కావడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. రాజా సింగ్ బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు వార్తలు వచ్చాయి.
ఎమ్మెల్యే రాజాసింగ్: వార్డు కార్యాలయాల పేరుతో తెలంగాణ సర్కార్ షో పుటప్: ఎమ్మెల్యే రాజాసింగ్
హరీశ్ రావుతో జరిగిన భేటీని రాజాసింగ్ వివరించారు. తన నియోజకవర్గంలోని సమస్యలను వివరించేందుకే ఈ భేటీ అని, ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీని వీడేది లేదని రాజాసింగ్ తెలిపారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఇటీవల రాజాసింగ్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యంగా బీజేపీలో చర్చనీయాంశంగా మారాయి.