నాదెండ్ల మనోహర్: ఆ నియోజకవర్గం నాదే… పోటీపై జనసేన అధినేత నాదెండ్ల మనోహర్ క్లారిటీ ఇచ్చారు.

నాదెండ్ల మనోహర్: ఆ నియోజకవర్గం నాదే… పోటీపై జనసేన అధినేత నాదెండ్ల మనోహర్ క్లారిటీ ఇచ్చారు.

గుంటూరు జిల్లాలో సమస్యలపై జనసేన పోరాటం చేస్తుందని నాదెండ్ల అన్నారు. రానున్న రోజుల్లో జనసేన పార్టీ బాట సజావుగా సాగేందుకు అధినేత సూచనల మేరకు కృషి చేస్తానన్నారు.

నాదెండ్ల మనోహర్: ఆ నియోజకవర్గం నాదే... పోటీపై జనసేన అధినేత నాదెండ్ల మనోహర్ క్లారిటీ ఇచ్చారు.

నాదెండ్ల మనోహర్

జనసేన నేత నాదెండ్ల మనోహర్: వచ్చే ఏడాది ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీపై జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందో త్వరలో చెబుతానని, అయితే నేను తెనాలి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు అన్ని జిల్లాల్లో కార్యకర్తలతో సమీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సమస్యలపై పోరాడుతున్న పవన్ కళ్యాణ్‌కు అందరూ మద్దతుగా నిలిచారని, రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు జనసేన పోరాటం చేస్తుందన్నారు. వాలంటీర్ల ద్వారా పవన్ కళ్యాణ్ పై అక్రమ కేసులు పెట్టారని, వాలంటీర్ల ద్వారా వ్యవస్థకు జరుగుతున్న నష్టాన్ని ప్రజలకు చెబుతున్నానన్నారు.

హైపర్ ఆది : అంబటి రాంబాబుకి కౌంటర్ ఇచ్చిన హైపర్ ఆది.. సినిమా కలెక్షన్స్ చూడనక్కర్లేదు.. లెక్కలు చెబుతారు..

ముఖ్యమంత్రి కార్యాలయంలో జరుగుతున్న డేటా చోరీని ప్రజలకు తెలియజేసి వైసీపీ నేతలు విమర్శిస్తున్నారని, తన కార్యాలయంలో 225 ఫైళ్లు మాయమైతే నియంతలా ప్రవర్తించే ముఖ్యమంత్రి ఏం చేశారని నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరుకు ఏం చేశారు? పులిచింతలకు గేటు వెళ్తే ఇంతవరకు దొరకలేదన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో డబ్బులు చేతులు మారుతున్నాయి. విచారణ కమిటీ వేయాలని మనోహర్ డిమాండ్ చేశారు.

పవన్ కళ్యాణ్: ఇది బాధాకరమైన రోజు అని కన్నీళ్లు పెట్టుకున్న పవన్ కళ్యాణ్

గుంటూరు జిల్లాలో సమస్యలపై జనసేన పోరాటం చేస్తుందని నాదెండ్ల అన్నారు. రానున్న రోజుల్లో జనసేన పార్టీ బాట సజావుగా సాగేందుకు అధినేత సూచనల మేరకు కృషి చేస్తానన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందో త్వరలో చెబుతానన్న నాదెండ్ల.. తెనాలి నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు. టీటీడీలో జరుగుతున్న అక్రమాలపై జనసేన నేతలు పోరాడుతున్నారని, శ్రీవాణి ట్రస్టుకు పదివేలు డిపాజిట్ చేస్తే రశీదు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *