కింది స్థాయి అధికారులు తప్పు చేస్తే సమర్థించుకునే ప్రయత్నం చేస్తే పై స్థాయి అధికారులు సైతం ఇరుక్కుంటారు. ఇప్పుడు తాను తప్పు చేశానన్న విషయాన్ని దాచిపెట్టి ఓ వ్యక్తిని కాపాడేందుకు ప్రయత్నించిన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పై కేసు నమోదైంది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ తన అఫిడవిట్ను ట్యాంపరింగ్ చేసిన ఘటనలో సీఈసీపై కూడా కేసు నమోదైంది. ఈ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది.
2018 ఎన్నికల సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ తన నామినేషన్తో పాటు అఫిడవిట్ కూడా సమర్పించారు. వాటిని ఈసీ వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. తర్వాత ఆ అఫిడవిట్ మారింది. పాతది డిలీట్ చేసి కొత్తది అప్లోడ్ చేసింది. ఈ ట్యాంపరింగ్పై ఫిర్యాదు చేస్తూ మహబూబ్నగర్ జిల్లా చలువగాలి రాఘవేంద్రరాజు హైదరాబాద్ నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన కోర్టు కేసులు నమోదు చేయాలని ఆదేశించింది. మంత్రి శ్రీనివాస్గౌడ్పై మంత్రి అనుచరుల నుంచి మరిన్ని బెదిరింపులు వస్తున్నాయంటూ మహబూబ్నగర్ పోలీసులు కేసు నమోదు చేయలేదని రాఘవేంద్రరాజు ఇటీవల మరోసారి కోర్టును ఆశ్రయించారు.
మంత్రి శ్రీనివాస్గౌడ్తో పాటు మరో 10 మంది అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసు వివరాలను సమర్పించాలని ఆదేశించారు. లేని పక్షంలో కోర్టు ఆదేశాల ఉల్లంఘన కింద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మహబూబ్నగర్ పోలీసులపై కోర్టు హెచ్చరించింది. ఇక చేసేదేమీ లేదని గ్రహించిన పోలీసులు.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో పాటు మరో పది మంది అధికారులపై మహబూబ్ నగర్ లోని టూటౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి కోర్టుకు వివరాలు సమర్పించారు. ఈ పది మందిలో సీఈసీ కూడా ఉంది.
ఇది చాలా సీరియస్ కేసు.. పై స్థాయి వ్యక్తులంతా ఇరుక్కుపోయే ప్రమాదం ఉండడంతో.. ఈ కేసులో పోరాడుతున్న రాఘవేంద్రరాజుపై కూడా హత్యకు కుట్ర పన్నారనే అభియోగాలు మోపారు. ఈ కేసులో సైబరాబాద్ కమిషనర్గా ఉన్న స్టీఫెన్ రవీంద్రపై కూడా ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ఈ కేసు ఎలాంటి మలుపులు తిరిగినా సంచలనం సృష్టించడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.