భారత జట్టు వెస్టిండీస్ టూర్కి వెళ్లకముందే చాలా మందికి ఈ టూర్ అవసరమా..? బ్యాట్స్మెన్లు తమ రికార్డులను మెరుగుపరచుకోవడం తప్ప పని చేయడం లేదని మాజీ ఆటగాళ్లు వాపోయారు.

టీమ్ ఇండియా
Team India Unwanted Records : భారత జట్టు వెస్టిండీస్ టూర్ కి వెళ్లకముందే చాలా మందికి ఈ టూర్ అవసరమా..? బ్యాట్స్మెన్లు తమ రికార్డులను మెరుగుపరచుకోవడం తప్ప పని చేయడం లేదని మాజీ ఆటగాళ్లు వాపోయారు. 2023 వన్డే ప్రపంచకప్కు అర్హత సాధించని జట్టుతో ఆడడం అవసరమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాగా, టెస్టు, వన్డే, టీ20 సిరీస్లను టీమిండియా క్లీన్స్వీప్ చేస్తుందని అభిమానులు భావించారు.
కట్ చేస్తే… టెస్టుల్లో 1-0తో నెగ్గిన భారత్ వన్డేల్లో 2-1 తేడాతో తృటిలో చావును చేజార్చుకుని విజయం సాధించినట్లే. ఇక టీ20 సిరీస్లో టీమిండియా ప్రదర్శన పేలవంగా ఉంది. స్టార్ ప్లేయర్స్ కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేని భారత జట్టుపై వెస్టిండీస్ 3-2 తేడాతో విజయం సాధించింది. మరికొద్ది రోజుల్లో ఆసియా కప్, వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానుండగా.. ఈ ఓటమిని భారత జట్టు గుణపాఠంగా తీసుకుని రాబోయే టోర్నీల్లో విజేతగా నిలవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
BCCI Twitter DP : ప్రదాని పిలుపు.. బ్లూ టిక్ కోల్పోయిన బీసీసీఐ.. ఎందుకో తెలుసా..?
కాగా, టీ20 సిరీస్ కోల్పోయిన భారత్ ఖాతాలో కొన్ని చెత్త రికార్డులు చేరాయి.
– గత 25 నెలల్లో భారత్ ఓడిపోయిన తొలి ద్వైపాక్షిక టీ20 సిరీస్ ఇదే.
– గత 17 ఏళ్లలో వెస్టిండీస్తో టీమిండియా ద్వైపాక్షిక సిరీస్ను కోల్పోవడం ఇదే తొలిసారి.
– ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను టీమిండియా కోల్పోవడం ఇదే తొలిసారి.
– ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో వెస్టిండీస్ భారత్ను ఓడించడం ఇదే తొలిసారి.
– ఈ సిరీస్కు ముందు, ద్వైపాక్షిక సిరీస్లలో టీమ్ ఇండియా ఎప్పుడూ మూడు టీ20 మ్యాచ్లను ఓడిపోలేదు.
కాగా, వెస్టిండీస్ పర్యటన ముగిసిన తర్వాత భారత జట్టు ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. అక్కడ భారత్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ జరగనుంది. బుమ్రా సారథ్యంలో టీమిండియా బరిలోకి దిగనుంది. ఆగస్టు 18 నుంచి సిరీస్ ప్రారంభం కానుంది.