కామారెడ్డి (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. కామారెడ్డి నియోజకవర్గంలో ఈసారి సీఎం కేసీఆర్ స్వయంగా బరిలోకి దిగనున్నారు. జిల్లాలోని మిగతా మూడు నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టిక్కెట్లు కేటాయిస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. కేసీఆర్ ప్రకటించిన టిక్కెట్ల జాబితాలో గంప గోవర్ధన్ కు చోటు దక్కలేదు. ఆ స్థానంలో కేసీఆర్ పోటీ చేస్తారు. దీంతో జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో ఎవరికి టిక్కెట్లు దక్కుతాయనే ఉత్కంఠ నెలకొంది. అభ్యర్థుల జాబితాను ముందుగానే ప్రకటించారు. బాన్సువాడ, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు రావడంతో పార్టీ శ్రేణులు, ఎమ్మెల్యేల అనుచరులు సంబరాల్లో మునిగిపోయారు. కామారెడ్డిలో కేసీఆర్ పోటీ చేయడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్తో పాటు ముఖ్య నేతలు కేసీఆర్కు స్వాగతం పలికారు. పార్టీ శ్రేణులు కూడా సంబరాలు చేసుకున్నారు.
ఉమ్మడి నిజామాబాద్ను క్లీన్స్వీప్ చేసేందుకు..
జాతీయ రాజకీయాల్లో రాణించేందుకు టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చారు కేసీఆర్. అయితే రానున్న రోజుల్లో జాతీయ రాజకీయాల్లో రాణించాలనే ఉద్దేశంతో కేసీఆర్ కామారెడ్డి నియోజకవర్గాన్ని టార్గెట్ చేసినట్లు పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది. దీంతో పాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనూ బలం పెంచుకునేందుకు కామారెడ్డి నియోజకవర్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని మూడు అసెంబ్లీ స్థానాల్లో ప్రతికూల పరిస్థితులు ఉన్నాయని సీఎం కేసీఆర్ సర్వేలో తేలింది. ఈ నేపథ్యంలో కామారెడ్డి నుంచి పోటీ చేస్తే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను క్లీన్ స్వీప్ చేయవచ్చనే భావనలో కేసీఆర్ ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేస్తే నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్ నాలుగు ఎంపీ స్థానాలపై ప్రభావం చూపవచ్చని ఆ పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ కామారెడ్డి నియోజకవర్గంపై గురిపెట్టినట్లు తెలుస్తోంది.
కామారెడ్డిలో కేసీఆర్
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గంతో పాటు కామారెడ్డి నియోజకవర్గం నుంచి కూడా సీఎం కేసీఆర్ పదోసారి పోటీ చేయనున్నారు. 1983లో సిద్దిపేట నియోజకవర్గం నుంచి తొలిసారి పోటీ చేసి ఓడిపోయారు. 1985లో కేసీఆర్ సిద్దిపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు, అప్పటి నుంచి కేసీఆర్ ఎప్పుడూ ఓడిపోలేదు. సిద్దిపేట నియోజకవర్గం నుంచి వరుసగా 1989, 1995, 1999 ఎన్నికల్లో గెలుపొందారు. 2001లో టీఆర్ఎస్ పార్టీని స్థాపించిన తర్వాత రాజీనామా చేసి అదే నియోజకవర్గం నుంచి ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. 2004 ఎన్నికల్లో సిద్దిపేట నుంచి గెలుపొందారు. 2006లో కరీంనగర్ ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. 2008లో కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా గెలిచి.. 2014లో గజ్వేల్ నుంచి పోటీ చేసి సీఎం అయ్యారు. 2018లోనూ అక్కడి నుంచి పోటీ చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్తో పాటు కామారెడ్డి నియోజకవర్గంలో కేసీఆర్ పోటీ చేయనున్నారు.
కోనాపూర్ కేసీఆర్ పూర్వీకుల ఇల్లు
సీఎం కేసీఆర్ తల్లి వెంకటమ్మ స్వస్థలం కామారెడ్డి నియోజకవర్గంలోని బీబీపేట్ మండలం కోనాపూర్ గ్రామం. సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం రాజన్న మోహిని కుంటకు చెందిన తండ్రి రాఘవరావు. రాఘవరావు వెంకటమ్మ పెళ్లి తర్వాత కోనాపూర్ వచ్చారు. అప్పట్లో రాజన్న సిరిసిల్ల ద్వారా ఎగువ మానేరు ప్రాజెక్టు నిర్మాణంతో కోనాపూర్ గ్రామం ముంపునకు గురైంది. అప్పట్లో రాఘవరావుకు చెందిన వందలాది ఎకరాల భూములు ముంపునకు గురయ్యాయి. దీంతో కేసీఆర్ కుటుంబం సిద్దిపేట జిల్లా చింతమడకకు వలస వచ్చి స్థిర నివాసం ఏర్పరుచుకుంది. బీబీపేట మండలం కోనాపూర్కు గతేడాదికి ముందు పలు అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం మంత్రి కేటీఆర్ వచ్చారు. ఆ సమయంలో కోనాపూర్లోని అమ్మమ్మ ఇంటికి మంత్రి కేటీఆర్ వచ్చారు. పుట్టిన ఊరికి ఏదైనా చేయాలనే భావనతో కేటీఆర్ తన సొంత నిధులు రూ.2.5 కోట్లతో కోనాపూర్ లో ప్రభుత్వ పాఠశాలను నిర్మించారు. ఆ గ్రామంలో పాఠశాల భవనంతో పాటు అనేక బిటి, సిసి రోడ్లు, కల్వర్టులు నిర్మించారు. ఈ అభివృద్ధి పనులను మంత్రి కేటీఆర్ త్వరలో ప్రారంభించనున్నారు.
కేసీఆర్ వర్గమే అంతం..
కామారెడ్డి నియోజకవర్గంలో కేసీఆర్ సామాజికవర్గం అంతంత మాత్రంగానే ఉంది. ఇక్కడ వెల్మ ఓట్లు దాదాపు 2వేలు మాత్రమే. నియోజకవర్గంలో ఎక్కువగా ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన ఓట్లు 31 వేలకు పైగా ఉన్నాయి. ఆ తర్వాత మైనార్టీ ఓట్లు 28 వేలు, మున్నూరు కాపు 16 వేలు, వైశ్యుల ఓట్లు 16 వేలు, ఆర్య క్షత్రియుల ఓట్లు 2 వేలు. ఈ నియోజకవర్గంలో మొత్తం ఓట్లు 2,27,807 కాగా అందులో పురుషుల ఓట్లు 1,10,056. ఇందులో 1,17,787 మంది మహిళలు, 28 మంది థర్డ్ జెండర్లు ఉన్నారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన గంప గోవర్ధన్ 4557 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గంపగోవర్ధన్కు 1,62,231 ఓట్లు పోల్ కాగా 68,167 ఓట్లు గల్లంతయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్ అలీ 63,610 ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు.