తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు పెరిగాయి. హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఒకే విధంగా ఉన్నాయి.

బంగారం ధర
ఈరోజు బంగారం, వెండి ధరలు: బంగారం, వెండి ధరలు షాకిస్తున్నాయి. వినియోగదారులను తగ్గించిన వెండి, బంగారం ధరలు మళ్లీ ఊపందుకుంటున్నాయి. గత కొన్ని రోజులుగా నిలకడగా ఉన్న వీటి ధరలు రెండు రోజుల్లో భారీగా పెరిగాయి. ముఖ్యంగా పవిత్ర శ్రావణ మాసం సందడి నేపథ్యంలో దేశీయంగా బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయి. మరోవైపు పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. వచ్చే వారం నుంచి లక్షల పెళ్లిళ్లు జరగనున్నాయి. ఈ క్రమంలో బంగారం, వెండికి డిమాండ్ పెరిగింది. బంగారం దుకాణాలు కిటకిటలాడాయి. ఈ క్రమంలో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పెరిగి కొనుగోలుదారులకు షాకిచ్చాయి.

బంగారం
తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా..
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు పెరిగాయి. హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఒకే విధంగా ఉన్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,200 కాగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,130కి చేరింది. గత రెండు రోజుల్లో 10 గ్రాముల బంగారంపై రూ. 100 నుంచి 150 పెరిగింది. మరోవైపు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. ఒక్కరోజులో కిలో వెండి రూ. 1500 పెరిగింది. మంగళవారం కిలో వెండి ధర రూ.76,500 ఉండగా, బుధవారం ఉదయం వరకు రూ. 78,000 చేరుకుంది.

బంగారం
దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఇలా..
– నిన్నటితో పోలిస్తే ఢిల్లీలో బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,300 కాగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,200.
– ముంబైలో బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,200 కాగా 22 క్యారెట్ల బంగారం ధర రూ. 59,130.
– బెంగళూరులోనూ బంగారం ధరలు పెరిగాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 54,200 కాగా 24 క్యారెట్ల బంగారం రూ. 59,130కి చేరింది.
– చెన్నైలోనూ బంగారం ధరలు పెరిగాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 54,600 కాగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,560.

వెండి
వెండి ధరలు భారీగా పెరిగాయి
– వెండి ధరలు భారీగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి రూ. 1500 పెరిగింది. బుధవారం ఉదయం నమోదైన ధరల ప్రకారం కిలో వెండి రూ. 78,000.
– ఢిల్లీలో కిలో వెండి రూ. 1300 పెరిగింది. దీంతో అక్కడ కిలో వెండి ధర రూ. 74,800 వద్ద ట్రేడవుతోంది.
– చెన్నైలో వెండి కిలోకు రూ.1300 పెరిగింది. ప్రస్తుతం అక్కడ కిలో వెండి ధర రూ. 78,000 మార్కు ట్రేడవుతోంది.
– బెంగళూరులో కిలో వెండి రూ.1,250 పెరిగింది. దీంతో కిలో వెండి రూ. 73,750 మార్కు వద్ద ట్రేడవుతోంది.
– ముంబైలో కిలో వెండి రూ. 1500 పెరిగింది. ప్రస్తుతం అక్కడ కిలో వెండి ధర రూ. 74,800 వద్ద ట్రేడవుతోంది.