చివరిగా నవీకరించబడింది:
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి శుక్రవారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. అధికారికంగా ఎన్డీయేలో చేరారు. అమిత్ షా, కుమారస్వామి సమావేశానికి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, గోవా సీఎం ప్రమోద్ సావంత్ కూడా హాజరయ్యారు.

జేడీ(ఎస్) ఎన్డీఏలో చేరింది: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి శుక్రవారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. అధికారికంగా ఎన్డీయేలో చేరారు. అమిత్ షా, కుమారస్వామి సమావేశానికి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, గోవా సీఎం ప్రమోద్ సావంత్ కూడా హాజరయ్యారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా X లో JP నడ్డా తెలిపారు. JD-S NDAలో చేరడం పట్ల నడ్డా సంతోషం వ్యక్తం చేశారు. ఎన్డీయేలో చేరాల్సిందిగా జేడీఎస్ను సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. కుమారస్వామి పార్టీ విలీనంతో ఎన్డీయే మరింత బలపడుతుందని చెప్పారు.
గత కొంతకాలంగా చర్చలు..(ఎన్డీఏలో జేడీ(ఎస్) చేరిక)
కాగా, గత కొంత కాలంగా బీజేపీ, జేడీఎస్ పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయి. అయితే, వచ్చే లోక్సభ ఎన్నికల్లో జేడీఎస్తో పొత్తు ఉంటుందని కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడ్యూరప్ప ఇటీవల ప్రకటించారు. కర్ణాటకలోని మొత్తం 28 లోక్సభ నియోజకవర్గాల్లో నాలుగు లోక్సభ స్థానాలకు ప్రాంతీయ పార్టీ జేడీఎస్ పోటీ చేస్తుందని చెప్పారు. కానీ యడ్యూరప్ప మాత్రం రెండు పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయని… మోడీ, అమిత్ షా బిజీబిజీగా ఉన్నారని… గ్రీన్ సిగ్నల్ రాగానే జేడీఎస్ ఎన్డీయేలో చేరుతుందని చెప్పారు.
కాగా, 2019 లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ క్లీన్స్వీప్ చేసింది. మొత్తం 25 లోక్సభ స్థానాలను గెలుచుకుంది. స్వతంత్ర సభ్యురాలు సుమలత మద్య భాజపా మద్దతుతో గెలుపొందారు. కాంగ్రెస్, జేడీఎస్ ఒక్కో సీటు గెలుచుకున్నాయి. కాగా, ఈ ఏడాది మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 135 స్థానాలు, బీజేపీ 66 స్థానాలు గెలుచుకున్నాయి. జేడీఎస్ 19 సీట్లు గెలుచుకుంది.