లేడీ పవర్స్టార్ సాయి పల్లవి పెళ్లి ముహూర్తం ఖరారైంది.. తమిళ దర్శకుడితో ఏడడుగులు వేసింది… దండల మార్పిడికి సాక్ష్యం ఇదిగో అంటూ మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది.

లేడీ పవర్స్టార్ సాయి పల్లవి పెళ్లి..
తమిళ దర్శకుడితో ఏడడుగులు…
దండలు మార్చే సాక్ష్యం ఇదిగో
మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఈ వార్త హల్ చల్ చేస్తోంది. ఈ తరుణంలో సాయి పల్లవి కూడా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఓ పోస్ట్ చేసింది. అయితే గతంలో ఇలాంటి పుకార్లపై ఆమె స్పందించలేదు. ఈసారి కుటుంబ సభ్యులు కూడా చేరి కాస్త ఘాటుగా స్పందించారు. అసలు విషయం ఏంటంటే..
రెండు రోజుల క్రితం దర్శకుడు రాజ్కుమార్ పెరియస్వామితో సాయి పల్లవి తన ఫోటోను షేర్ చేసి పెళ్లి చేసుకున్నట్లు నెటిజన్లు వైరల్ చేశారు. ‘శివ కార్తికేయన్ 21’ అనే వర్కింగ్ టైటిల్తో రూపొందుతున్న ఈ సినిమా పూజా కార్యక్రమంలోని చిత్రమిది. అందులో పల్లవి మెడలో దండలు వేయడం చూసి దర్శకుడు, సాయి పెళ్లి చేసుకోబోతుందనే ప్రచారం మొదలైంది. సాయి పల్లవితో ‘విరాట పర్వం’ సినిమా తీసిన దర్శకుడు వేణు ఊడుగుల ఆ ఫోటోలు చూసి క్లారిటీ ఇచ్చాడు. ఇదే విషయంపై సాయి పల్లవి స్పందించింది.
‘‘సాధారణంగా నేను పుకార్లను పెద్దగా పట్టించుకోను.. కానీ, స్నేహితులను, కుటుంబ సభ్యులను అందులో భాగం చేస్తూ తప్పనిసరి పరిస్థితుల్లో స్పందిస్తూ.. నేను నటించిన సినిమా పూజా కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను క్రాప్ చేస్తున్నారు. డబ్బు కోసం నీచమైన ప్రచారాలు చేయడం.. నా కొత్త సినిమాల గురించి మంచి అప్డేట్లు పంచుకోవడానికి సిద్ధమవుతున్న సమయంలో ఇలాంటి పనికి స్పందించడం నిజంగా బాధాకరం.. ఇలాంటి వ్యక్తిని ఇబ్బంది పెట్టడం నిజంగా నీచమైన చర్య” అని అన్నారు. మండిపడిన సాయి పల్లవి.. కొంత గ్యాప్ తర్వాత మళ్లీ తెలుగు తెరపై మెరవబోతోంది.నాగ చైతన్య హీరోగా గీతా ఆర్ట్స్ నిర్మిస్తున్న చిత్రంలో కథానాయికగా ఎంపికైంది.చందు మొండేటి దర్శకుడు.ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.
నవీకరించబడిన తేదీ – 2023-09-22T17:36:08+05:30 IST