డీలిమిటేషన్: డీలిమిటేషన్ అంటే ఏమిటి? దక్షిణాది రాష్ట్రాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి?

డీలిమిటేషన్: డీలిమిటేషన్ అంటే ఏమిటి?  దక్షిణాది రాష్ట్రాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి?

బీజేపీ చేసే ప్రతి పనికి కాస్త ఫిట్టింగ్ పెట్టడం అలవాటు. ఆ ఫిట్టింగ్ కూడా మామూలుగా లేదు, దాని ప్రభావం చాలా పెద్దది. బీజేపీ తనకు మాత్రమే లాభించేలా, ఇతరులను ఇబ్బందుల్లోకి నెట్టేలా మంచి వ్యూహంతో ఆ ఫిట్టింగ్‌లను పెట్టుకుంది. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలోనూ అదే జరుగుతోంది. ఈ బిల్లు లోక్‌సభ మరియు రాజ్యసభలో ఆమోదం పొందింది, అయితే దీని అమలుకు కొన్ని చిక్కులు ఉన్నాయి. అది.. జనాభా లెక్కలు, డీలిమిటేషన్. ఈ రెండింటిలో జనాభా గణన అంశాన్ని పక్కన పెడితే.. డీలిమిటేషన్ ప్రక్రియ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా.. దక్షిణాది రాష్ట్రాలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

అసలు ఈ డీలిమిటేషన్ అంటే ఏమిటి?

పార్లమెంటరీ లేదా అసెంబ్లీ నియోజకవర్గాల సరిహద్దులను పునర్నిర్మించే ప్రక్రియను డీలిమిటేషన్ అంటారు. జనాభా ప్రాతిపదికన ప్రజాప్రతినిధులకు సీట్లు కేటాయించాలనే ఆలోచనతో ఈ డీలిమిటేషన్‌ను తెరపైకి తెచ్చారు. అంటే.. ప్రతి ప్రతినిధి (పార్లమెంటు లేదా రాష్ట్ర శాసనసభ సభ్యుడు) సభలో సమాన సంఖ్యలో జనాభాకు ప్రాతినిధ్యం వహించాలి. అయితే.. ఈ డీలిమిటేషన్ ప్రక్రియను అమలు చేయాలంటే ముందుగా రాజ్యాంగం ప్రకారం జనాభా గణన జరగాలి. నిజానికి.. జనాభా గణన 2021లో జరగాల్సి ఉంది. కానీ.. కోవిడ్ మహమ్మారి కారణంగా అది జరగలేదు. ఇంకో విషయం ఏంటంటే.. మోడీ ప్రభుత్వం ఇప్పటి వరకు జనాభా లెక్కలను ప్రారంభించలేదు.

దక్షిణాది రాష్ట్రాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి?

ఉత్తర భారతంతో పోలిస్తే.. దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా రేటు చాలా తక్కువ. ఉత్తరాదిలో జనాభా గణనీయంగా పెరుగుతుండగా, దక్షిణాదిలో, జనాభా నియంత్రణలో కేంద్ర నిబంధనలను అనుసరిస్తున్నారు. అందుకే.. దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల సక్రమంగా ఉంది. సాధారణంగా చెప్పాలంటే.. దక్షిణాది కంటే ఉత్తరాది జనాభా ఎక్కువ. ఇలాంటప్పుడు.. డీలిమిటేషన్ ప్రక్రియ ఉత్తరాది రాష్ట్రాలకే మేలు చేస్తుంది. జనాభా ప్రాతిపదికన సీట్లు ఉండాలనేది నిబంధన కాబట్టి.. ఉత్తరాదిలో జనాభా ఎక్కువగా ఉండడంతో అక్కడ సీట్లు పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కానీ, దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తక్కువగా ఉండడంతో ఉన్న సీట్లకు కోత పడే ప్రమాదం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు గట్టి దెబ్బ తగులుతుంది. ఈ రెండు రాష్ట్రాల్లో కలిపి 8 సీట్లు తగ్గే అవకాశం ఉందని సమాచారం. అలాగే తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు 8 సీట్లు, కర్ణాటకకు కూడా 2 సీట్లు తగ్గే అవకాశం ఉందని సమాచారం. దక్షిణాది రాష్ట్రాలన్నీ కలిపితే 165 సీట్లు మాత్రమే వస్తాయని, మిగిలిన సీట్లన్నీ ఉత్తరాదికి వెళ్తాయని కొన్ని మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి. ఈ లెక్కలు నిజమా? అనే విషయంపై పూర్తి క్లారిటీ లేదు కదా, అయితే ఈ డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయని సర్వేలు చెబుతున్నాయి. అందుకే.. ఈ డీలిమిటేషన్ ప్రక్రియను ఇక్కడి నేతలు ఇప్పటి నుంచే వ్యతిరేకిస్తున్నారు.

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఇటీవల ఇండియా టుడే గ్రూప్ విడుదల చేసిన డీలిమిటేషన్ లెక్కల జాబితాను షేర్ చేస్తూ ఈ ప్రక్రియకు వ్యతిరేకంగా ట్వీట్ చేశారు. ఈ డీలిమిటేషన్ లెక్కలు నిజమైతే దక్షిణ భారతదేశంలోనే బలమైన ప్రజా ఉద్యమానికి దారి తీస్తుందని హెచ్చరించారు. మనమందరం గర్వించే భారతీయులమని అన్నారు. దేశంలోనే దక్షిణాది రాష్ట్రాలు అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్నాయి. దేశంలోని అత్యున్నత ప్రజాస్వామిక వేదికపై మన ప్రజల గొంతులను, ప్రాతినిథ్యాన్ని అణిచివేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కేంద్రం మరోసారి ఈ అంశాన్ని పున:ప్రారంభిస్తే బాగుంటుందని కేటీఆర్ ట్విట్టర్‌లో సూచించారు.

గతంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా ఈ డీలిమిటేషన్ ప్రక్రియను వ్యతిరేకించారు. ఇది రాజకీయ ఎత్తుగడ అని, జనాభా ప్రాతిపదికన పార్లమెంటులో సీట్లు పెంచితే దక్షిణ భారత రాష్ట్రాలకు రాజకీయ ప్రాతినిధ్యం తగ్గుతుందన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును స్వాగతిస్తున్నాం కానీ.. డీలిమిటేషన్ పేరుతో దక్షిణ భారత ప్రజలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చూడాలని స్టాలిన్ ప్రధాని మోదీని డిమాండ్ చేశారు. దక్షిణ భారత ప్రజలు డీలిమిటేషన్ పట్ల ఉన్న భయాన్ని తొలగించాలని మోదీ కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *