చివరిగా నవీకరించబడింది:
ఇజ్రాయెల్ పై హమాస్ మెరుపు దాడిని ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే ఖండించిన సంగతి తెలిసిందే. హమాస్ దాడి గురించి తెలిసిన కొన్ని గంటల్లోనే ఆయన ట్విటర్లో దాడిపై స్పందించారు.

ప్రధాని మోదీ వ్యాఖ్యలు: ఇజ్రాయెల్ పై హమాస్ మెరుపు దాడిని ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే ఖండించిన సంగతి తెలిసిందే. హమాస్ దాడి గురించి తెలిసిన కొన్ని గంటల్లోనే ఆయన ట్విటర్లో దాడిపై స్పందించారు. దాడి తనను బాధించిందని, ఈ క్లిష్ట సమయంలో ఇజ్రాయెల్కు అండగా ఉంటానని చెప్పాడు. ఇందుకు ఇజ్రాయెల్ మంత్రి ధన్యవాదాలు తెలిపారు. ఇటీవల ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ప్రధాని మోదీ ఫోన్లో సంభాషించారు.
ఇజ్రాయెల్కు మా మద్దతు.. (ప్రధాని మోదీ వ్యాఖ్యలు)
నెతన్యాహు మంగళవారం తనకు ఫోన్ చేసి హమాస్తో జరుగుతున్న యుద్ధంపై చర్చించారని ప్రధాని మోదీ తెలిపారు. ఇజ్రాయెల్కు భారత్ అన్ని విధాలుగా అండగా ఉంటుందని తాను నెతన్యాహుకు హామీ ఇచ్చానని మోదీ చెప్పారు. అన్ని రకాల ఉగ్రవాదాన్ని భారత్ తీవ్రంగా ఖండిస్తున్నదని మోదీ ఉద్ఘాటించారు. హమాస్తో కొనసాగుతున్న వివాదంపై తనకు ఫోన్ చేసి అప్డేట్ ఇచ్చినందుకు ప్రధాని నెతన్యాహుకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ క్లిష్ట సమయంలో భారత ప్రజలు ఇజ్రాయెల్కు అండగా నిలుస్తున్నారు. ఉగ్రవాదాన్ని భారత్ అన్ని విధాలుగా నిర్ద్వంద్వంగా ఖండిస్తుందని సామాజిక వేదిక X ద్వారా ప్రధాని మోదీ స్పందించారు.
అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీలు ఇజ్రాయెల్కు మద్దతు తెలుపుతూ హమాస్ ఉగ్రవాద కార్యకలాపాలను ఖండిస్తూ ప్రకటన విడుదల చేసిన నేపథ్యంలో.. ప్రధాని మోదీకి ఇజ్రాయెల్ నుంచి ఈ ఫోన్ కాల్ వచ్చింది. ఇజ్రాయెల్తో పాటు పాలస్తీనాకు భారత్ మిత్రదేశమని, ప్రస్తుత సంక్షోభాన్ని పరిష్కరించేందుకు సాయం చేసేందుకు ముందుకు రావాలని పాలస్తీనా రాయబారి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మోదీ, నెతన్యాహుల మధ్య సంభాషణ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే.. పాలస్తీనా విషయంలో భారత్ నుంచి ఎలాంటి స్పందన లేదు. హమాస్ దాడిని వ్యతిరేకిస్తూ, ఇజ్రాయెల్కు మద్దతు ఇచ్చింది.