కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె కుమార్తె ప్రియాంక కొన్నాళ్ల తర్వాత కలిసి నగరానికి రానున్నారు.
– రేపు సోనియా, ప్రియాంక రాక
పెరంబూర్ (చెన్నై): కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె కుమార్తె ప్రియాంక చాలా ఏళ్ల తర్వాత కలిసి నగరానికి రానున్నారు. డీఎంకే మహిళా హక్కుల మహానాడుకు వీరు హాజరుకానున్నారు. దీంతో కాంగ్రెస్ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. 1998లో కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సోనియా, ప్రియాంక రాష్ట్రంలో పార్టీ నిర్వహించిన మహానాడులో పాల్గొన్నారు. ఆ తర్వాత 2018లో ప్రియాంక కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో నగరంలో ఈ నెల 14న జరగనున్న డీఎంకే మహిళా హక్కుల మహానాడులో సోనియా, ప్రియాంక ఒకే వేదికను పంచుకోనున్నారు. సీఎం స్టాలిన్ నేతృత్వంలో డీఎంకే సంయుక్త కార్యదర్శి కనిమొళి ఆధ్వర్యంలో జరిగే ఈ మహానాడుకు ప్రియాంక, సుప్రియా సూలే ప్రత్యేక అతిథులుగా హాజరుకానున్నారు. సుభాషిణి అలీ, అని రాజా, సుస్మితాదేవ్ తదితరులు మాట్లాడతారు. 25 ఏళ్ల క్రితం సోనియా, ప్రియాంక పాల్గొన్న మహానాడు శ్రీపెరంబుదూర్ సమీపంలో జరిగింది.
సత్యమూర్తి భవన్కు ఆహ్వానం…: శనివారం నగరానికి వస్తున్న సోనియా, ప్రియాంకలకు రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఆహ్వానం పంపింది. సత్యమూర్తి భవన్కు రావాల్సిందిగా తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కేఎస్ అళగిరి ఆహ్వానించారు. ఈ విషయమై ఉత్తర చెన్నై జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఎం.ఎస్.ద్రవ్యం విలేకరులతో మాట్లాడుతూ… అప్పటికే సత్యమూర్తి భవన్కు వచ్చిన సోనియాకు అప్పటి రాష్ట్ర అధ్యక్షుడు తంగబాలు ఘన స్వాగతం పలికారు. ఇప్పటి వరకు సత్యమూర్తి భవన్కు ప్రియాంక రాలేదని, ప్రస్తుత పర్యటనలోగా సత్యమూర్తి భవన్కు రావాలని కార్యకర్తలు కోరుతున్నారు. ‘ఈ-మెయిల్’ ద్వారా ప్రియాంకకు ఆహ్వానం పంపినట్లు తెలిపారు.
నవీకరించబడిన తేదీ – 2023-10-13T07:12:22+05:30 IST