బెంగళూరు: కర్ణాటకలోని ప్రభుత్వ కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ డెవలపర్ల కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ జరిపిన దాడుల్లో పట్టుబడిన రూ.94 కోట్లు బీజేపీకి చెందినవేనని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు. స్వాధీనం చేసుకున్న డబ్బుతో కాంగ్రెస్కు సంబంధాలున్నాయంటూ బీజేపీ చేస్తున్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. జేపీ నడ్డా నేతృత్వంలోని బీజేపీని ‘అవినీతికి పునాది’గా డీకే అభివర్ణించారు.
‘అవినీతి అంతా బీజేపీదే. అవినీతికి పార్టీయే పునాది. అందుకే ఆ పార్టీని కర్ణాటక ప్రజలు తిరస్కరించారు. పట్టుబడిన సొమ్ముకు బీజేపీ నేతలతో సంబంధాలు ఉన్నాయి. మీడియాతో మాట్లాడిన డీకే.. ‘‘కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు.
ఈ నెల 12వ తేదీన కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, న్యూఢిల్లీ రాష్ట్రాల్లోని పలువురు ప్రభుత్వ కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ డెవలపర్ల కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసింది. లెక్కల్లో చూపని రూ.94 కోట్ల నగదు, రూ.8 కోట్ల విలువైన బంగారు, వజ్రాభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే 30 ఖరీదైన చేతి గడియారాలు దొరికాయి. కర్ణాటక కాంట్రాక్టర్ అంబికాపతి సన్నిహితుడి నివాసంలో రూ.42 కోట్లు స్వాధీనం. రాష్ట్ర ప్రభుత్వంలో అవినీతికి వ్యతిరేకంగా గతేడాది ప్రధానికి లేఖలు రాసిన కాంట్రాక్టర్లలో అంబికాపతి కూడా ఉన్నారు. ఆదివారం కర్ణాటకలోని మరో బిల్డర్ సంతోష్ కృష్ణప్ప నివాసంలో రూ.40 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఐదు రాష్ట్రాల ఎన్నికల ఖర్చుల కోసం కర్ణాటక ఏటీఎం మిషన్గా మారిందని, మొత్తం క్యాచ్ కాంగ్రెస్దేనని బీజేపీ ఆరోపించింది. కర్నాటక నుంచి ఎన్నికలకు డబ్బులు వెళుతున్నాయని గతంలో తాము చేసిన ఆరోపణలు వాస్తవమేనన్నారు. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని బీజేపీ నేత సీటీ రవి డిమాండ్ చేశారు.
డీకేకు బీజేపీ సవాల్
ఆదాయపన్ను శాఖ దాడుల్లో పట్టుబడిన డబ్బుతో బీజేపీ నేతలకు సంబంధం ఉందన్న డీకే శివకుమార్ ఆరోపణలను కమలనాథులు తోసిపుచ్చారు. ఒకవేళ ఆ డబ్బు బీజేపీకి చెందినదైతే విచారణ జరిపి ఆధారాలు నిరూపించి స్వాధీనం చేసుకున్న డబ్బు ఎవరిదైనా వారిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేత సదానందగౌడ డిమాండ్ చేశారు.
నవీకరించబడిన తేదీ – 2023-10-17T16:53:47+05:30 IST