గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో హమాస్ వైమానిక దళ చీఫ్ ఇస్సామ్ అబు రుక్బే హతమైనట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం రాత్రి జరిగిన దాడిలో అతడు మరణించాడని ఇజ్రాయెల్ మిలటరీ తెలిపింది.

టెల్ అవీవ్: గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో హమాస్ వైమానిక దళ చీఫ్ ఇస్సామ్ అబు రుక్బే హతమైనట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం రాత్రి జరిగిన దాడిలో అతడు మరణించాడని ఇజ్రాయెల్ మిలటరీ తెలిపింది. హమాస్కు చెందిన డ్రోన్లు, పారాగ్లైడర్లు, ఏరియల్ డిటెక్షన్ సిస్టమ్లకు అబు సందేశాలు పంపేవాడని మిలటరీ తెలిపింది. అక్టోబరు 7న ఇజ్రాయెల్పై హమాస్ జరిపిన దాడుల్లో ఇతడు కీలక పాత్ర పోషించాడని.. అబూ ఆదేశాల మేరకు హమాస్ పారాగ్లైడర్లు ఇజ్రాయెల్ దక్షిణ ప్రాంతంలోకి చొచ్చుకుపోయి దాడికి పాల్పడ్డారని ఐడీఎఫ్ వెల్లడించింది.
ఇంతకుముందు, హమాస్ ఏరియల్ ఫోర్సెస్ మాజీ చీఫ్ మురాద్ అబు ముదాద్ రెండు వారాల కిందటే చంపబడ్డాడని IDF ప్రకటించింది. గాజా స్ట్రిప్లో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ యొక్క రాత్రిపూట గ్రౌండ్ ఆపరేషన్ సమయంలో, సైనికులు మరియు హమాస్ ఉగ్రవాదుల మధ్య అనేక సార్లు ఘర్షణలు జరిగాయి. అయితే ఈ ఘర్షణల్లో సైనికులు ఎవరూ గాయపడలేదని సమాచారం. హమాస్ ఉగ్రవాదులే లక్ష్యంగా ఈ దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. హమాస్ ఉగ్రవాద సంస్థకు చెందిన సుమారు 150 భూగర్భ ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని ఐడీఎఫ్ వైమానిక దాడులు చేసింది. దీంతో పలువురు హమాస్ మిలిటెంట్లు హతమైనట్లు ఇజ్రాయెల్ తెలిపింది. శుక్రవారం రాత్రి, యెమెన్లోని ఇరాన్ యొక్క ప్రాక్సీ ఉగ్రవాద సంస్థ హౌతీలు ఇజ్రాయెల్పై క్రూయిజ్ క్షిపణిని ప్రయోగించారు. ఈ క్షిపణి ఇజ్రాయెల్ సరిహద్దు సమీపంలోని ఈజిప్టులోని తబాను తాకింది. ఈ దాడిలో ఆరుగురు ఈజిప్టు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. అయితే వెంటనే యుద్ధాన్ని ఆపాలని ప్రపంచ దేశాలు ఇజ్రాయెల్ పై ఒత్తిడి తెస్తున్నాయి.
నవీకరించబడిన తేదీ – 2023-10-28T14:17:42+05:30 IST