ప్రెస్ మీట్ లో ఆప్ నేతల ఆందోళన
ఆప్ ను ఎదుర్కోలేక నేతల అరెస్టులు
బీజేపీ లక్ష్యం ‘భారత్’
తదుపరి సోరెన్, తేజస్వి అరెస్ట్!
పినరయి, స్టాలిన్లు కూడా టార్గెట్
ఢిల్లీ మంత్రి అతిషి ఆరోపణలు
అది ఆప్ చేసిన కర్మ: బీజేపీ
న్యూఢిల్లీ, అక్టోబర్ 31: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్కు ఈడీ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే..! గురువారం ఉదయం 11 గంటలకు ఈడీ ఎదుట హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన్ను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని ఆప్ నేత అతిషి అనుమానం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ వాడుకుంటోందని ఆరోపించారు. కేజ్రీవాల్ను గురువారం అరెస్టు చేసే అవకాశం ఉందని సమాచారం. కేజ్రీవాల్కు మోడీ భయపడుతున్నారని.. ఎన్నికల్లో కేజ్రీవాల్ను ఓడించలేరని బీజేపీ గ్రహించిందని.. అందుకే తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఆప్ నేతలు సిసోడియా, సంజయ్ సింగ్, సత్యేందర్జైన్లను బీజేపీ అరెస్ట్ చేసిందని దుయ్యబట్టారు. నేతలను జైలుకు పంపి ఆప్ అడ్డంకిని తొలగించాలని బీజేపీ చూస్తోందన్నారు. “కేజ్రీవాల్ అరెస్టు తర్వాత, బిజెపి భారత కూటమి నాయకులను కూడా లక్ష్యంగా చేసుకుంటుంది. ముఖ్యంగా ప్రతిపక్ష సిఎంలపై సిబిఐ మరియు ఇడి దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయి. జార్ఖండ్ సిఎం హేమంత్సోరెన్, ఆర్జెడి నాయకుడు తేజస్వీదవ్, కేరళ సిఎం పినరయి విజయన్ మరియు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా బిజెపి టార్గెట్ లిస్ట్లో ఉన్నారు. ,” ఆమె ఆరోపించింది. మరోవైపు, ఆప్ నేతలు సౌరభ్ భరద్వాజ్, గోపాల్ రాయ్ కూడా ప్రత్యేక విలేకరుల సమావేశంలో కేజ్రీవాల్ను అరెస్టు చేసే అవకాశం ఉందని చెప్పారు. ఆప్ ఆరోపణలను బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ ఖండించారు. వారి చర్యల ఫలాలను వారు (ఏపీ నేతలు) అనుభవిస్తారని వ్యాఖ్యానించారు.
నవీకరించబడిన తేదీ – 2023-11-01T04:04:32+05:30 IST