పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి: మాజీ ఎంపీ, కాంగ్రెస్‌ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇళ్లు, కార్యాలయంలో ఐటీ సోదాలు

కాంగ్రెస్‌ నేత పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై దాడులు చేశారు

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి: మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ పాలేరు నియోజకవర్గ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఈరోజు తెల్లవారుజామున 4.30 గంటల నుంచి ఖమ్మంలోని పొంగులేటి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. దాదాపు 8 వాహనాల్లో వచ్చిన ఐటీ అధికారులు ఖమ్మం ఇల్లు, పాలేరు క్యాంపు కార్యాలయంలో సోదాలు చేశారు. పొంగులేటి అనుచరుల సెల్‌ఫోన్లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని పొంగులేటి నివాసాలపై ఉదయం 6 గంటల నుంచి దాడులు కొనసాగుతున్నాయి. పొంగులేటి రాఘవ కన్‌స్ట్రక్షన్స్ పేరుతో కంపెనీని ఏర్పాటు చేశారు.

బీఆర్‌ఎస్‌లో ఉన్న పొంగులేటి తనకు ఎంపీ సీటు ఇవ్వకపోవడంతో పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఇటీవలే కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ నుంచి పాలేరు అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. పొంగులేటి నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ క్రమంలో పొంగులేటి కుటుంబ సభ్యులంతా ఖమ్మంలోని ఆయన ఇంటికి చేరుకున్నారు. పొంగులేటి నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ క్రమంలో పొంగులేటి కుటుంబ సభ్యులంతా ఖమ్మంలోని ఆయన ఇంటికి చేరుకున్నారు. ఇప్పుడు ఆ మాటలను నిజం చేసేలా తాజాగా సోదాలు జరగడం గమనార్హం.

బీఆర్‌ఎస్‌ వీడినప్పటి నుంచి పొంగులేటి సీఎం కేసీఆర్‌పైనా, తెలంగాణ ప్రభుత్వంపైనా విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆ పార్టీలో కాంగ్రెస్ ప్రచార కమిటీ కో-ఛైర్మెన్‌గా ఉన్నారు. మాజీ మంత్రి, ఖమ్మం నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు నివాసంలో బుధవారం ఈసీ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ నేతల ఇళ్లు, కార్యాలయాలపై వరుసగా అధికారులు దాడులు చేయడంపై కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాజకీయ కక్ష సాధింపుతో కాంగ్రెస్ నేతలపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు.

పోస్ట్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి: మాజీ ఎంపీ, కాంగ్రెస్‌ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇళ్లు, కార్యాలయంలో ఐటీ సోదాలు మొదట కనిపించింది ప్రైమ్9.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *