ముంబై: న్యూజిలాండ్తో జరుగుతున్న వన్డే ప్రపంచకప్ తొలి సెమీఫైనల్లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో కీలకమైన టాస్ గెలిచిన కెప్టెన్ రోహిత్ శర్మ.. ముందుగా బ్యాటింగ్ చేస్తామని తెలిపాడు. ఈ మ్యాచ్లో టీమిండియా తుది జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది. ఇక న్యూజిలాండ్ కూడా ఈ మ్యాచ్లో తమ తుది జట్టులో ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగుతోంది. ఈ వన్డే ప్రపంచకప్లో లీగ్ దశలో ఆడిన 9 మ్యాచ్ల్లో టీమిండియా గెలిచి 18 పాయింట్లతో టేబుల్ టాపర్గా నిలిచింది. ఆడిన 9 మ్యాచ్ల్లో ఐదు గెలిచి, నాలుగు ఓడిన న్యూజిలాండ్ నాలుగో స్థానంతో సెమీస్కు చేరుకుంది. కాగా, లీగ్ దశలో ఇరు జట్ల మధ్య జరిగిన పోరులో టీమిండియా విజయం సాధించింది.
చివరి జట్లు
న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), డారిల్ మిచెల్, మార్క్ చాప్మన్, గ్లెన్ ఫిలిప్స్, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), మిచెల్ సాంట్నర్, టిమ్ సౌతీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్
గత రికార్డులు
ముంబైలోని వాంఖడే పిచ్పై ఇప్పటి వరకు 27 వన్డే మ్యాచ్లు జరగగా, 14 సార్లు మొదట బ్యాటింగ్ చేసిన జట్లు గెలుపొందగా, 13 సార్లు రెండో బ్యాటింగ్ చేసిన జట్లు గెలిచాయి. ఈ ప్రపంచకప్లో ఇక్కడ ఆడిన 4 మ్యాచ్ల్లో ముందుగా బ్యాటింగ్ చేసిన జట్లే మూడుసార్లు గెలిచాయి. రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్టు ఒక్కసారి మాత్రమే గెలిచింది. ఈ ప్రపంచకప్లో వాంఖడే పిచ్పై తొలి ఇన్నింగ్స్ సగటు స్కోరు 357 పరుగులు. రెండో ఇన్నింగ్స్ సగటు 187 పరుగులు. వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటివరకు భారత్, న్యూజిలాండ్ జట్లు 10 సార్లు తలపడ్డాయి. 5 మ్యాచ్ల్లో కివీస్ గెలుపొందగా, భారత్ 4 మ్యాచ్ల్లో విజయం సాధించింది. ఒక మ్యాచ్ అసంపూర్తిగా ఉంది. మొత్తంగా వన్డే ఫార్మాట్లో ఇరు జట్లు 117 సార్లు తలపడ్డాయి. భారత్ అత్యధికంగా 59 మ్యాచ్లు గెలుపొందగా, న్యూజిలాండ్ 50 మ్యాచ్లు గెలిచింది. ఒక మ్యాచ్ టై కాగా, ఏడు మ్యాచ్లు రద్దయ్యాయి.