తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. టాపార్డర్లో యశస్వి జైస్వాల్ (53)..

తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. టాపార్డర్లో యశస్వి జైస్వాల్ (53), ఇషాన్ కిషన్ (52), రుతురాజ్ గైక్వాడ్ (58) హాఫ్ సెంచరీలతో ఊచకోత కోశారు. చివర్లో రింకూ సింగ్ (8 బంతుల్లో 30) మెరిసినా.. భారత్ ఇంత భారీ స్కోరు చేయగలిగింది. భారత ఆటగాళ్లను ఆస్ట్రేలియా బౌలర్లు ఏమాత్రం నియంత్రించలేకపోయారు. అందరూ భారీ పరుగులు అందించారు. భారత ఆటగాళ్లు తప్పుడు షాట్లతో వికెట్లు తీశారు తప్ప.. ఆస్ట్రేలియా బౌలర్లు ఆగలేకపోయారు.
భారత ఓపెనర్లు రాగానే భారీ షాట్లతో ఆస్ట్రేలియా బౌలర్లపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా.. జైస్వాల్ బంతిని షాట్లతో అదరగొట్టాడు. 25 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. తక్కువ తినలేదన్నట్లుగా.. ఇషాన్ కిషన్ కూడా ఉత్సాహంగా ఆడాడు. మెరుపులాంటి భారీ షాట్లు కొట్టి పరుగుల వర్షం కురిపించాడు. ఓ వైపు రుతురాజ్ నిదానంగా ఆడుతూనే మరోవైపు ఇషాన్ చాలా బౌండరీలు బాదుతున్నాడు. సూర్యకుమార్ (19)కి ఈసారి పెద్దగా ఇన్నింగ్స్ రాలేదు. చివర్లో వచ్చిన రింకూ సింగ్ దుమ్మురేపింది. 9 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 31 పరుగులు చేశాడు. అలాగే.. తిలక్ వర్మ కూడా సిక్సర్ కొట్టి తన సత్తా చాటాడు. యువ ఆటగాళ్లు చెలరేగడంతో భారత్ 235 పరుగులు చేయగలిగింది.
ఆస్ట్రేలియా బౌలర్ల విషయానికి వస్తే.. సియాన్ అబాట్ అత్యంత ఖరీదైన బౌలర్గా నిలిచాడు. 3 ఓవర్లలో 56 పరుగులు ఇచ్చాడు. నాథన్ ఎల్లిస్ తన నాలుగు ఓవర్ల కోటాలో 45 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. స్టోయినిస్ 27 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా గెలవాలంటే 236 పరుగులు చేయాల్సి ఉంది. చూడ్డానికి భారీ స్కోరు ఉన్నప్పటికీ, ఆస్ట్రేలియాలోనూ ఊచకోత కోసే బ్యాట్స్మెన్లు ఉన్నారు. కాబట్టి.. బౌలర్లు గట్టిగా బౌలింగ్ చేయాల్సి ఉంటుంది.
నవీకరించబడిన తేదీ – 2023-11-26T20:59:19+05:30 IST