న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దుపై సోమవారం సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుంది. తీర్పు నేపథ్యంలో కాశ్మీర్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అయితే తీర్పును రాజకీయం చేయవద్దని బీజేపీ అభ్యర్థించింది. శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగబోదని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా స్పష్టం చేశారు. ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా జమ్మూ కాశ్మీర్ పార్టీలు కూటమిగా ఏర్పడి గుప్కార్ అలయన్స్ పేరుతో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించింది. ఈ ఏడాది ఆగస్టు 2 నుంచి కోర్టు సుదీర్ఘ విచారణ చేపట్టింది. ఆగస్టు 5, 2019న, ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ పార్లమెంట్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని జమ్మూ కాశ్మీర్లోని అనేక రాజకీయ పార్టీలు వ్యతిరేకించాయి.
పూర్తి వివరాలు..
జమ్మూకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం రాజ్యాంగ బద్ధమైనదేనా అనే అంశంపై సుప్రీంకోర్టు సోమవారం తీర్పు వెలువరించనుంది. ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్లు సంజయ్ కిషన్ కౌల్, సంజీవ్ ఖన్నా, బిఆర్ గవాయ్, సూర్యకాంత్లతో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ తీర్పుపై ఆసక్తి కనబరుస్తోంది. ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ పలువురు దాఖలు చేసిన పిటిషన్లపై ఆగస్టు 2న సుప్రీంకోర్టు విచారణ ప్రారంభించగా.. 16 రోజుల విచారణ అనంతరం సెప్టెంబర్ 5న తీర్పును రిజర్వ్ చేస్తున్నట్టు ధర్మాసనం ప్రకటించింది. విచారణ సందర్భంగా ఆర్టికల్ 370 రద్దు తరఫు, ప్రత్యర్థి పక్షాల తరఫున పలువురు సీనియర్ న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. జమ్మూ కాశ్మీర్ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని పలువురు పిటిషనర్లు కూడా వ్యతిరేకించారు. కాగా, సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జమ్మూకశ్మీర్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
రాజ్యాంగ విరుద్ధం: ముఫ్తీ
నేషనల్ కాన్ఫరెన్స్ వైస్ ప్రెసిడెంట్ ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు తీర్పు జమ్మూకశ్మీర్ ప్రజలకు అనుకూలంగా వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగ విరుద్ధమైన చర్య మాత్రమే కాదు, జమ్మూ కాశ్మీర్ ప్రజలకు ఇచ్చిన హామీలను ఉల్లంఘించడమేనని, సుప్రీంకోర్టు తీర్పు ఈ విషయాన్ని స్పష్టం చేస్తుందని పిడిపి అధ్యక్షురాలు ముఫ్తీ అన్నారు. సుప్రీంకోర్టు బీజేపీ ఎజెండాను ముందుకు తీసుకెళ్లకుండా దేశ సమగ్రతను కాపాడాలి. ఆర్టికల్ 370తో జమ్మూ కాశ్మీర్ ప్రజలకు భావోద్వేగ సంబంధం ఉందని, దానిని పునరుద్ధరించాలని డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ నాయకుడు గులాం నబీ ఆజాద్ అన్నారు. సుప్రీంకోర్టు తీర్పును అందరూ గౌరవించాలని బీజేపీ జమ్మూకశ్మీర్ అధ్యక్షుడు రవీందర్ రైనా అన్నారు.